AP News:విదేశీ సాయానికి కేంద్రం మెలిక
‘రుణదాత ఇచ్చే నిధులతోపాటు మా వాటా ప్రకారం ముందుగా నిధులివ్వాల్సి ఉన్నా అలా ఇవ్వలేం. ముందు రుణ మొత్తం రుణదాత నుంచి ఇప్పించండి. ఆ సొమ్ముతో పనులు చేస్తాం. ఆనక మా వాటా
మొత్తం రుణం ముందే ఇవ్వడం కుదరదు
అన్ని ప్రాజెక్టుల్లో మీవాటా నిధులివ్వండి
లేకుంటే గ్రామీణ రహదారులకూ అడ్వాన్సులు ఇవ్వలేమంటూ రాష్ట్రానికి లేఖ
రూ.11,290 కోట్ల ప్రాజెక్టులపై నీలినీడలు
ఈనాడు - అమరావతి
‘రుణదాత ఇచ్చే నిధులతోపాటు మా వాటా ప్రకారం ముందుగా నిధులివ్వాల్సి ఉన్నా అలా ఇవ్వలేం. ముందు రుణ మొత్తం రుణదాత నుంచి ఇప్పించండి. ఆ సొమ్ముతో పనులు చేస్తాం. ఆనక మా వాటా నిధులు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చిస్తాం’ అని ఆంధ్రప్రదేశ్ కోరగా.. కేంద్ర ఆర్థిక శాఖ అలా సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఒప్పందం ప్రకారం మీ వాటా నిధులిచ్చి ఆ మొత్తంతో పనులు చేస్తేనే రుణమైనా, అడ్వాన్సు అయినా ఇవ్వగలమని కుండబద్దలు కొట్టింది. అంతే కాదు.. ప్రపంచబ్యాంకు సాయంతో చేపట్టిన 24×7 ప్రాజెక్టుతోపాటు విదేశీ ఆర్థికసాయంతో చేపడుతున్న అన్ని ఇతర ప్రాజెక్టుల్లో రాష్ట్ర వాటా నిధులు తక్షణమే ఏజెన్సీలకు బదిలీ చేయాలని షరతు పెట్టింది. అలా చేయకపోతే గ్రామీణ రహదారుల నిర్మాణ ప్రాజెక్టులో రాష్ట్రం కోరుతున్న రూ.540 కోట్ల అడ్వాన్సు కూడా ఇవ్వబోమని తేల్చేసింది. మరో 3 రహదారుల ప్రాజెక్టుల్లో ఎప్పటికప్పుడు రాష్ట్ర వాటా నిధులు విడుదల చేసి పనుల పురోగతి తెలియజేయకపోతే అడ్వాన్సులివ్వడంపైనా పునరాలోచిస్తామని తేల్చిచెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్కు కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి లేఖ రాశారు. దీంతో రాష్ట్రంలో రూ.11,290 కోట్ల రహదారి ప్రాజెక్టుల భవితవ్యం చర్చనీయాంశమైంది.
* ఆసియా మౌలిక సౌకర్యాల కల్పన బ్యాంకు రుణసాయంతో రూ.4,290 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణ ప్రాజెక్టును రాష్ట్రంలో చేపట్టారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,285 కోట్లు. తొలి దశలో 1,400 కి.మీ.రోడ్లు నిర్మించేందుకు పనులు చేపట్టారు.
కొంతమేర పనులు జరిగాయి. 2019లో ఒప్పందం కుదిరిన ప్రాజెక్టు 2024లో పూర్తి కావాల్సి ఉంది. ఇంతవరకు చెప్పదగ్గ పురోగతి లేదు.
* న్యూడెవలప్మెంటు బ్యాంకు సాయంతో రాష్ట్రంలో మండల కేంద్రాల మధ్య, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రహదారుల అనుసంధాన ప్రాజెక్టు, వంతెనల పునర్నిర్మాణం లేదా మరమ్మతును 2 ప్రాజెక్టులుగా రాష్ట్రం చేపట్టింది. రూ.6,400 కోట్లు ప్రాజెక్టు అంచనా వ్యయం. ఇందులో రూ.2,130 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాలి. తొలి దశలో రూ.2,970 కోట్లతో పనులు చేపడుతున్నారు. ఇందులో రూ.1,860 కోట్ల సివిల్ పనులకు గతేడాది మార్చిలో గుత్తేదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇంతవరకు పది శాతం పనులు కాలేదు.
ఇప్పుడెలా?
రూ.6,400 కోట్ల ప్రాజెక్టులో అప్పు మొత్తం ముందే ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఇలా రుణదాతలు ఇవ్వబోరని, కేంద్రం అంగీకరించదని ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నా సరే లేఖ రాయాలని ఒత్తిళ్లు ఉన్నాయంటే ఆ ప్రాజెక్టులో రాష్ట్రం తన వాటా ఇచ్చేందుకు ఏ స్థాయిలో సిద్ధంగా ఉందో ఇట్టే అవగతమవుతుందని ఆర్థిక శాఖలోని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
* పైగా గ్రామీణ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుకు రూ.540 కోట్ల అడ్వాన్సు ఇవ్వాలంటే విదేశీ సాయంతో చేపట్టే మిగిలిన అన్ని ప్రాజెక్టుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ వాటా తక్షణం చెల్లించాలని కేంద్రం షరతు పెట్టింది. తమ వాటా తర్వాత ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఉంటే, ఈ ఒక్కటే కాదు అన్ని ప్రాజెక్టుల్లోనూ మీ వాటా తక్షణం ఇవ్వాలని కేంద్రం షరతు పెట్టింది. ఈ పరిస్థితుల్లో రూ.11,290 కోట్ల రోడ్ల ప్రాజెక్టులను ప్రభుత్వం ఎలా ముందడుగు వేయిస్తుందన్న అనుమానాలు వస్తున్నాయి.
3 ప్రాజెక్టుల్లో ఇవీ షరతులు
ఎన్డీబీ, ఏఐఐబీ సాయంతో చేపడుతున్న రోడ్ల అనుసంధానం, వంతెనల పునరుద్ధరణ, గ్రామీణ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి విదేశీ రుణసాయం అందించేందుకు కేంద్రం షరతులు విధించింది.
* రుణదాత రుణ మొత్తం ఇచ్చిన వెంటనే ఆ నిధులను ప్రాజెక్టు డైరెక్టర్ ఖాతాలోకి 7 పనిదినాలలోపు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలి. తన వాటానూ నిర్దిష్ట గడువులోగా జమ చేయాలి.
* ఈ 3ప్రాజెక్టుల్లో పనుల పురోగతి, బిల్లుల చెల్లింపు పరిస్థితి తదితర అంశాలను ప్రతి నెలా కేంద్రానికి, రుణమిస్తున్న ఏజెన్సీలకు తెలపాలి. వీటిని పరిశీలించి ప్రస్తుతం నిర్ణయించిన అడ్వాన్సు విధానం కొనసాగించాలా? లేదా? అన్నది డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ నిర్ణయిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
మంత్రి ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు. -
ఎన్నికల వేళ పురస్కారాల ఎత్తుగడ
పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని గత అయిదేళ్లుగా ప్రతిపక్ష నేతలు, ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులతో తీవ్ర నిర్బంధాలు, అణిచివేత అమలుచేస్తున్న జగన్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఆ పోలీసులను తన గుప్పిట్లో ఉంచుకునేందుకు మరో ఎత్తుగడ వేసింది. -
భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
సంక్షిప్తవార్తలు
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
వ్యవస్థలను కాపాడుకుంటేనే రక్షణ
మన పిల్లలు గౌరవంగా బతకాలంటే.. వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. -
గ్రూప్ 1 అప్పీళ్లపై విచారణ ఏప్రిల్ 18కి వాయిదా
గ్రూప్-1 నోటిఫికేషన్ (27/2018) ప్రధాన పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ధర్మాసనం ముందు దాఖలు చేసిన అప్పీళ్ల విచారణ ఏప్రిల్ 18కి వాయిదా పడింది. -
కంప్యూటర్ ఎక్కడ.. ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఈసీలు లేకుండా రిజిస్ట్రేషన్లు ఎలా?
రిజిస్ట్రేషన్ శాఖ నిర్వాకంతో రాష్ట్రంలో గత పది రోజుల నుంచి ఈసీల జారీ నిలిచిపోవడంతో ఆస్తుల క్రయవిక్రయదారులు అవస్థలు పడుతున్నారు. -
పింఛన్ల పంపిణీపై ప్రచారం నిర్వహించకూడదు
ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన పింఛన్ల పంపిణీపై ఎలాంటి ప్రచారం నిర్వహించరాదని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) స్పష్టం చేసింది. -
పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరేం?
‘నోటి కాడికి వచ్చిన పంట నిలువునా ఎండిపోతుంటే పట్టించుకోరా’ అని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరుకు చెందిన రమణమ్మ.. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డిని బుధవారం ప్రశ్నించారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
అంకెలు పెంచి.. ఆశలు తుంచారు!
ముందుచూపు మందగించిన జగన్ ఏలుబడిలో పోలవరం పనులు అటకెక్కాయి! పోనీ నిర్వాసితులకు పరిహారమైనా.. అందిందా అంటే ఊహూ.. అదీ లేదు!! ముంపును కళ్లారా చూశానన్నారు... ముప్పు నుంచి అమాయకులను రక్షించాల్సిందేనన్నారు... ఇస్తున్న ప్యాకేజీని పెంచాలన్నారు... ఇచ్చిన పరిహారం సరిపోదన్నారు... బాధితులే తొలి లబ్ధిదారులు కావాలన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నగదుంటేనే రైడ్ రైట్
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ