సముద్ర ఇసుకను.. నది ఇసుకగా అమ్మేస్తున్నారు
‘‘నెల్లూరు జిల్లా తీర ప్రాంతాల్లో లభించే సిలికా శాండ్ (సముద్రపు ఇసుక)ను నది ఇసుకగా చూపించి చెన్నైలో నిర్మాణదారులకు విక్రయిస్తున్నారు. దీనివల్ల నిర్మాణాలకు ప్రమాదం పొంచి
నిర్మాణాలు చేపడితే ప్రమాదమే
నెల్లూరు జిల్లా నుంచి చెన్నైకి జరుగుతున్న రవాణాను అడ్డుకోండి
తమిళనాడు సీఎంకు గ్రీన్ సొసైటీ లేఖ
ఈనాడు, అమరావతి: ‘‘నెల్లూరు జిల్లా తీర ప్రాంతాల్లో లభించే సిలికా శాండ్ (సముద్రపు ఇసుక)ను నది ఇసుకగా చూపించి చెన్నైలో నిర్మాణదారులకు విక్రయిస్తున్నారు. దీనివల్ల నిర్మాణాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. వీటిని అడ్డుకోండి’’ అంటూ తమిళనాడు ముఖ్యమంత్రికి నెల్లూరు జిల్లాకు చెందిన గ్రీన్ సొసైటీ ఈ నెల 20న లేఖరాసింది. చిల్లకూరు, కోట మండలాల్లో సిలికా శాండ్ లీజుల్లో నిబంధనల ఉల్లంఘనలపై అదే ప్రాంతానికి చెందిన కొందరు గ్రీన్ సొసైటీగా ఏర్పడి పోరాడుతున్నారు. ఆ సంస్థ ప్రతినిధి ఒకరు ఇప్పటికే ఓ లీజులో ఉల్లంఘనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్లో కేసు కూడా వేశారు. ఇసుక కాంట్రాక్టర్, తితిదే పాలకమండలి మాజీ సభ్యులు శేఖర్రెడ్డి మేనల్లుడు మోహన్కార్తీక్కు చెందిన వామన ఎంటర్ప్రైజెస్ ద్వారా కొంత కాలంగా పెద్ద ఎత్తున సిలికా శాండ్ చెన్నైకి తరలించి విక్రయాలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న 13 లారీలు, ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్న 5 లారీలు కలిపి మొత్తం 18 లారీల్లో నిరంతరం నెల్లూరు జిల్లా నుంచి చెన్నైకి సిలికాశాండ్ తరలిస్తున్నట్లు వివరించారు. ఆరంబాక్కం వద్ద ఓ పెట్రోల్ బంకు వెనుక వైపు ఈ ఇసుకను నిల్వచేసి, అక్కడి నుంచి తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఇసుకతో నిర్మాణాలు చేపడితే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే అవుతుందన్నారు. ఈ ఇసుక అక్రమ రవాణా, విక్రయాలను అడ్డుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
నిబంధనలు బేఖాతరు..
చిల్లకూరు, కోట మండలాల్లోని పలు లీజుల్లో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ గ్రీన్ సొసైటీ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు డీజీకి ఫిర్యాదు చేసింది. తమ్మినపట్నంలోని ఏపీఎండీసీకి చెందిన రెండు లీజుల్లో అదనపు తవ్వకాలు చేస్తోందని ఆరోపించారు. బల్లవోలు, మోమిడి, కొత్తపట్నంలోని ముగ్గురు లీజుదారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.
అంతా ఓ డీలరు కనుసన్నల్లో..
ఆ ప్రాంతంలో కొంతకాలం కిందట లైసెన్స్ పొందిన ఓ డీలరు చక్రం తిప్పుతున్నారు. ఏ లీజుదారైనా తమకే సిలికా శాండ్ ఇవ్వాలని, ఇందుకు టన్నుకు రూ.100 ఇస్తామని చెప్పి తన ఆధీనంలోకి తీసుకుంది. ఖనిజమంతా తీసుకొని.. ఇతర డీలర్లకు అధిక ధరలకు విక్రయిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. గనులశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి.
ఫిర్యాదు వచ్చింది.. పరిశీలిస్తాం..
నెల్లూరు గనులశాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసరావును ‘ఈనాడు’ వివరణ కోరగా.. ఆ ఫిర్యాదు తమకు కూడా వచ్చిందని, లీజులను పరిశీలిస్తామన్నారు. శేఖర్రెడ్డిని వివరణ కోరగా.. ఎంతో మంది బంధువులు ఉంటారని, వాళ్లు చేసే వ్యాపారాలతో తనకు సంబంధం లేదని, వాటి గురించి తెలియదని పేర్కొన్నారు. వామన ఎంటర్ప్రైజెస్ యజమాని మోహన్కార్తీక్ను సంప్రదించగా.. తాము కేవలం డీలర్ మాత్రమే అన్నారు. తమ వద్ద సిలికాశాండ్ కొనుగోలు చేసినవాళ్లు ఎక్కడికి తరలిస్తారో, దానితో సంబంధం ఉండదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
బస్సులు సీఎం సభకు.. కష్టాలు ప్రయాణికులకు
ఆర్టీసీ బస్సులను ముఖ్యమంత్రి సభకు తరలించడంతో కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రయాణికులు అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
మూడు రాజధానులు ఏర్పాటు చేశాం
‘మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేశాం’ నంద్యాల ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాట ఇది.. ఉన్న రాజధాని అమరావతినే చంపేసిన ఆయన.. మూడు రాజధానులు ఏర్పాటు చేశానని చెబుతున్నారు. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కరవును కళ్లారా చూడు జగనన్నా
‘ఏడాది ఓపిక పట్టండి. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. వలసల నివారణకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతం
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ బుధవారం నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
అంత తొందరెందుకు?
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 21 మంది సహాయ ఆచార్యులకు ఉన్నతి కల్పిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పాకశాస్త్ర కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న తిరుపతిలోని భారత పాకశాస్త్ర సంస్థ (ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్)లో వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ శిక్షణ, ప్లేస్మెంట్ అధికారి చెల్లేశ్వరరావు తెలిపారు. -
ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
దేవాదాయశాఖ కమిషనర్పై సుమోటో కోర్టుధిక్కరణ కేసు
దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణపై సుమోటోగా కోర్టుధిక్కరణ కేసు నమోదుచేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట
స్కిల్ కేసులో రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
పప్పూబెల్లాల్లా ఉన్నత విద్యామండలి నిధులు
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేషీ నిర్వహణ, ప్రభుత్వ సలహాదారు (విద్య) సాంబశివారెడ్డి కారు బిల్లు, సచివాలయంలోని ఉన్నత విద్యాశాఖలో పని చేస్తున్న సిబ్బందికి జీతాభత్యాలకు ఉన్నత విద్యామండలి నిధులను పప్పూ బెల్లాల్లా ఖర్చు పెట్టేస్తున్నారు. -
ఎన్నికల వేళ రూ.530 కోట్ల ఎర
కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులనూ ఇతర అవసరాలకు మళ్లించి పట్టణ స్థానిక సంస్థలను తీవ్ర అవస్థలకు గురి చేసిన జగన్ సర్కార్ ఎన్నికల వేళ సొంత పార్టీకి చెందిన పాలక వర్గాలను బుజ్జగించేందుకు కొత్త ఎత్తుగడ వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్