Buddha Venkanna: అదుపులోకి తీసుకుని.. అర్ధరాత్రి విడుదల
మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్లపై విమర్శలు చేశారనే ఆరోపణలపై తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పోలీసులు అరెస్టు చేశారని తెదేపా నేతలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
బుద్దా వెంకన్నను పోలీసులు తీసుకెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి, డీజీపీలపై ఆరోపణలు చేశారనే ఫిర్యాదుపై కేసు
ఈనాడు- అమరావతి, విద్యాధరపురం, న్యూస్టుడే: మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్లపై విమర్శలు చేశారనే ఆరోపణలపై తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పోలీసులు అరెస్టు చేశారని తెదేపా నేతలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల మోహరింపు, తెదేపా కార్యకర్తల ప్రతిఘటనల మధ్య వెంకన్నను ఒకటో పట్టణ పోలీసుస్టేషన్కు తరలించారు. సోమవారం రాత్రి వరకు ఆయన్ను విచారించారు. అనంతరం ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చి రాత్రి 11.15 గంటల సమయంలో విడిచిపెట్టారు. సోమవారం ఉదయం 11గంటలకు తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్మీరా, నాయకులతో కలిసి బుద్దా వెంకన్న విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం రెండింటికి బుద్దా నివాసానికి ఏసీపీలు హనుమంతరావు, రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా చేరుకుని విచారణకు వెంట తీసుకెళుతున్నట్లు ఆయనకు తెలిపారు. నోటీసు ఇవ్వకుండా విచారణ దేనికంటూ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఇదే సమయంలో తెదేపా నేతలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, నాగుల్మీరా, కార్యకర్తలు చేరుకున్నారు. దాదాపు 3గంటలసేపు పోలీసులు, నేతలకు మధ్య చర్చలు జరిగాయి. ఎట్టకేలకు పోలీసుస్టేషన్కు వచ్చేందుకు వెంకన్న అంగీకరించడంతో కార్యకర్తలను చెదరగొడుతూ బందోబస్తు మధ్య ఆయన్ని తరలించారు. మంత్రి అనుచరుడు, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గారావు ఫిర్యాదు మేరకు బుద్దా వెంకన్నపై పోలీసు కేసు నమోదైంది. రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు సెక్షను 153ఏ, భయోత్పాతం సృష్టించినందుకు సెక్షన్ 506, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని 505(2) రెడ్విత్ 34 కింద కేసులు నమోదు చేశారు.
డీజీపీ వాటా ఎంత..?: బుద్దా
మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన క్యాసినో వ్యవహారంలో రూ.250 కోట్లు చేతులు మారాయని బుద్దా వెంకన్న ఉదయం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఈ వ్యవహారంలో డీజీపీ వాటా ఎంతని ప్రశ్నించారు. డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీ అంటూ ధ్వజమెత్తారు. ‘మంత్రి కొడాలి నానిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదు? క్యాసినో నిర్వహించినట్లు సాక్ష్యాలున్నాయి. అయినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. మంత్రి కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు. అలాంటివారికి టిక్కెట్లివ్వడం చంద్రబాబు తప్పు. నీకు దమ్ముంటే పోలీసులు లేకుండా చంద్రబాబు ఇంటికి రా. చంద్రబాబు ఇంటి గేటు తాకగలవా?’ అంటూ ఘాటుగా హెచ్చరించారు. ‘నాని చరిత్ర గుడివాడలో అందరికీ తెలుసు. వర్ల రామయ్య పోలీసు అధికారిగా ఉన్నప్పుడు అరెస్టు చేశారని మర్చిపోయావా? గుడివాడ సంస్కృతిని చెడగొట్టావ’ంటూ విమర్శలు గుప్పించారు. షర్మిల ఏపీలో పార్టీ పెడితే మొదట మారేది కొడాలి నానే అని జోస్యం చెప్పారు. తర్వాత ఆయన జగన్ను దూషిస్తారని పేర్కొన్నారు. ‘2024లో ఓడాక నీ పరిస్థితేమిటో తెలుస్తుంది. నీవు మాట్లాడే భాషేంటి?’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీనియర్ నాయకులు వర్ల రామయ్య, మాజీ ప్రజాప్రతినిధులు బోండా ఉమా, జవహర్వంటి వారిని దూషించడం ఆయనకు ఎస్సీ, ఎస్టీ, బీసీలపైన ఉన్న గౌరవాన్ని స్పష్టం చేస్తోందని విమర్శించారు.
వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా..
పోలీసులు అదుపులోకి తీసుకున్నాక బుద్దా వెంకన్న మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తాను అబద్ధాలు చెప్పలేదని, ఉన్న విషయాన్నే తెలిపానని వివరించారు.
బుద్దా వెంకన్నను అదుపులోకి తీసుకోవడం దారుణం
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు
ఈనాడు డిజిటల్, అమరావతి: గుడివాడ క్యాసినోపై వాస్తవాలు వెల్లడించలేని పోలీసులు బుద్దా వెంకన్నను అదుపులోకి తీసుకోవడమేంటని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా వాళ్లపై దాడిచేసిన వారిని వదిలేసి మాపైనే కేసులు పెట్టడం సిగ్గుమాలిన చర్య. చేసిన పొరపాట్లకు పోలీసులు విచారణను ఎదుర్కొక తప్పదు’ అని పేర్కొన్నారు. ఏపీ పోలీసులు ప్రజారక్షకులా? లేదా వైకాపా నేతలకు కాపలాదారులా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ‘గుడివాడలో కొడాలి నాని క్యాసినో నడిపితే లేని పోలీసులు.. ప్రతిపక్ష నేతను దుర్భాషలాడితే లేనివారు.. తెదేపా కేంద్ర కార్యాలయాన్ని వైకాపా మూకలు ధ్వంసం చేస్తే లేని పోలీసులు బూతులేంటని ప్రశ్నించిన బుద్దా వెంకన్నను మాత్రం అదుపులోకి తీసుకున్నారు’ అని లోకేశ్ పేర్కొన్నారు. తెదేపా నేత బుద్దా వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు ఖండించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM