RTPP: సీమ వెలుగులపై చిన్నచూపు
రాయలసీమ వెలుగుదివ్వెగా పేరొందిన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ) భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం ఆరు యూనిట్లున్న సంస్థలో ప్రస్తుతం మూడు యూనిట్లలో మాత్రమే విద్యుదుత్పత్తి చేస్తున్నారు.
ఆర్టీపీపీలో పూర్తిస్థాయి ఉత్పత్తి సాధ్యమేనా?
సంస్థ భవిష్యత్తుపై ఉద్యోగుల ఆందోళన
ఎర్రగుంట్ల, న్యూస్టుడే
రాయలసీమ వెలుగుదివ్వెగా పేరొందిన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ) భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం ఆరు యూనిట్లున్న సంస్థలో ప్రస్తుతం మూడు యూనిట్లలో మాత్రమే విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఏపీ జెన్కో పరిధిలోని మిగతా తాప విద్యుత్తు కేంద్రాల్లో సమస్య వస్తేనే ఉన్నతాధికారులు ఇక్కడినుంచి అధిక విద్యుదుత్పత్తిని కోరుకుంటున్నారు. ఇక్కడ ఉత్పత్తి వ్యయం అధికమవుతోందన్న నెపంతో ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని కార్మికులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ మనుగడ, భవితవ్యంపై ఉద్యోగుల్లో క్రమేణా అపనమ్మకం ఏర్పడుతోంది. అనేకమంది ఉద్యోగులు డిప్యుటేషన్పై ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని దామోదరం సంజీవయ్య తాప విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 25ఏళ్లపాటు ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించడం వారి ఆందోళనకు కారణమవుతోంది.
నాడు ఘనం... నేడు హీనం
రాయలసీమలో ఉపాధి, లోవోల్టోజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా తాప విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 1988 మార్చి 18న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత 1991లో నిర్మాణ పనులు చేపట్టి 1995లో మొదటి యూనిట్లో ఉత్పత్తి ప్రారంభించారు. కేంద్రం క్రమేణా అభివృద్ధి చెందుతూ మొత్తం 4దశల్లో ఏర్పాటుచేసిన ఆరు యూనిట్లలో 1,650 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరింది. ప్రస్తుతం ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉందన్న నెపంతో వేల కోట్లు వెచ్చించిన ప్రాజెక్టును నామమాత్రంగా వినియోగిస్తున్నారు. ఏపీ జెన్కో పరిధిలోని మిగతా థర్మల్ కేంద్రాల్లో యూనిట్ ధర రూ.4లోపుంటే ఆర్టీపీపీలో రూ.5.50 వరకు ఖర్చవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్టీపీపీలో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉన్నందున థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించాల్సి వస్తే మొదటగా ఆర్టీపీపీ వైపే చూస్తున్నారు. దీంతో ఇక్కడ నామమాత్రంగా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వేల కుటుంబాలు పరిశ్రమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నాయి. డిమాండ్ మేరకు ఉత్పత్తి చేస్తున్నామని కేంద్రం చీఫ్ ఇంజినీర్ మోహన్రావు తెలిపారు.
పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేయాలి
వైకాపా ప్రభుత్వం వచ్చాక రెండున్నరేళ్లలో చాలా తక్కువ రోజులు మాత్రమే పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేశారు. దామోదరం సంజీవయ్య తాప విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ప్రైవేటుకు అప్పగించడంతో ఆర్టీపీపీ భవిష్యత్తుపై భయాందోళన పెరిగింది. లాభనష్టాలతో సంబంధం లేకుండా ఆర్టీపీపీలో పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి చేయాలి. - రామగోపాల్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు (బీఎంఎస్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ