AP News: డీజీపీ ఆఫీసుకు ఎందుకు?
గుడివాడ కేసినో వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్కు విన్నపమిచ్చేందుకు సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయానికి బయల్దేరిన తెదేపా నాయకులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కొల్లు రవీంద్ర తదితరులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.
పోలీసులపై నమ్మకం లేదంటున్నారు కదా
తెదేపా నాయకులను అడ్డుకున్న అదనపు ఎస్పీ, డీఎస్పీ
ఈనాడు, అమరావతి: గుడివాడ కేసినో వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్కు విన్నపమిచ్చేందుకు సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయానికి బయల్దేరిన తెదేపా నాయకులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కొల్లు రవీంద్ర తదితరులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. వారు రాబోతున్నారని తెలుసుకుని తెదేపా కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీసుకు వెళ్లే మార్గాన్ని బారికేడ్లతో ముందే మూసేశారు.
నాయకులను అడ్డుకుని అపాయింటుమెంట్ లేనిదే డీజీపీ కార్యాలయంలోకి వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేశారు. అపాయింటుమెంట్ అడిగామని, డీజీపీ నుంచి స్పందన లేదని, అందుకే నేరుగా బయల్దేరామని తెదేపా నేతలు చెప్పారు. డీజీపీ కాకపోతే.. అదనపు డీజీనైనా (శాంతిభద్రతలు) కలిసి వినతిపత్రమిచ్చేందుకు అనుమతించాలని కోరారు. దానికైనా అపాయింటుమెంట్ కావాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. తపాల్లో ఇచ్చి వెళతామన్నా అంగీకరించలేదు. ఇస్తే తమకివ్వాలని, లేదంటే తిరిగి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. పోనీ అదనపు ఎస్పీ తమను వెంటబెట్టుకుని వెళ్లాలని నేతలు కోరినా నిరాకరించారు. ప్రతిపక్షాలను ఇంత అవమానించకూడదని, రోడ్డుపై వినతిపత్రం తీసుకోవడమేంటని వర్ల ప్రశ్నించారు. మీకిస్తే డీజీపీకి విన్నపమిచ్చినట్టు ఎలా అవుతుందని నిలదీశారు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరినీ పంపవద్దని స్పష్టమైన ఆదేశాలున్నాయని అదనపు ఎస్పీ స్పష్టం చేశారు. ఎవరిని పడితే వాళ్లను ఎలా పంపిస్తాం.. మీరు ప్రతిదాన్నీ ఇష్యూ చేయవద్దని డీఎస్పీ రాంబాబు వాగ్వాదానికి దిగారు. నిజనిర్ధారణ కమిటీలో ఉన్న ఆరుగురినైనా, కనీసం ముగ్గురినైనా పంపాలని విన్నవించినా ససేమిరా అన్నారు. దీంతో అక్కడే అదనపు ఎస్పీకి తెదేపా నేతలు విన్నపమిచ్చి అక్నాలెడ్జ్మెంటు తీసుకుని వెనుతిరిగారు.
‘పోలీసులపై నమ్మకం లేదంటున్నారు కాబట్టి డీజీపీ ఆఫీసుకు వెళ్లడానికి లేదని పోలీసులు అడ్డుకున్నారు. అంటే తెదేపావారికి పోలీసులు సేవలందించరా? మా పార్టీవారిని ఎవరైనా హతమార్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అంటారా? వీళ్ల వైఖరి చూస్తుంటే రేపు పోలీసు స్టేషన్లోకి కూడా రానిచ్చేలా లేరు’ అని విలేకరులతో మాట్లాడుతూ వర్ల రామయ్య ధ్వజమెత్తారు. సెక్యూరిటీ జోన్లోకి అడుగు పెట్టేందుకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు.. పక్కనే ఉన్న తెదేపా కార్యాలయంపై దుండగులు దాడిచేస్తే ఏం చేశారని ఆలపాటి ధ్వజమెత్తారు. ఎస్సీ, బీసీ నాయకులను, మాజీ మంత్రులను డీజీపీ వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.
‘మీరు రోజూ ప్రతి అంశానికి డీజీపీని ముడిపెట్టి ఎలాబడితే అలా మాట్లాడుతున్నారు. మీ పార్టీ తరఫున డీజీపీకి లేఖలు రాస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే చేయండి. కానిస్టేబుల్నుంచి డీజీపీ వరకు పోలీసు వ్యవస్థపై నమ్మకం లేదన్నట్టు మాట్లాడుతున్నారు కదా? మీకు డీజీపీ ఆఫీసుకు వెళ్లడానికి అపాయింటుమెంట్ లేదు. కావాలంటే ఆ వినతిపత్రం ఇక్కడే ఇచ్చి వెళ్లండి. మేం డీజీపీకి అందజేస్తాం’
-గుడివాడలో కేసినో వ్యవహారం, నిజనిర్ధారణకు వెళ్లిన పార్టీ నాయకులపై దాడికి సంబంధించి డీజీపీకి విన్నపమివ్వడానికి వెళ్లిన తెదేపా నాయకులతో గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ గంగాధరం వ్యాఖ్యలివి.
‘పోలీసులపై నమ్మకం లేదంటున్నారు కాబట్టి మిమ్మల్ని డీజీపీ ఆఫీసులో అడుగు పెట్టనివ్వబోమని కాగితంపై రాసివ్వండి. మరి కోడికత్తితో దాడి జరిగినప్పుడు ఈ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, ఇక్కడ కంప్లెయింటే ఇవ్వబోనన్న జగన్ మాటలు కూడా మీరు వినకూడదు కదా? ఆయన చెప్పినట్టు ఎలా పనిచేస్తున్నారు? అయినా పోలీసులపై నమ్మకం లేదని నేను ఎప్పుడూ అనలేదు. అడ్డగోలుగా మాట్లాడొద్దు.’
-తెదేపా నాయకుడు వర్ల రామయ్య స్పందన
‘పోలీసులపై నమ్మకం లేదని నేనన్నాను. గుడివాడలో తెదేపా నేతలపై జరిగిన దాడిపై డీఐజీని కలుస్తామంటే.. ఆయన ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో మారుమూలన ఉన్నానని, రావడానికి అర్ధరాత్రి అవుతుందని చెప్పారు. సాయంత్రం ఐదింటికి ప్రెస్మీట్ పెట్టి తెదేపావారు అరాచకం చేయడానికే వచ్చారని చెప్పారు. మాకు జరిగిన నష్టాన్ని తెలుసుకుని న్యాయం చేయాల్సిన అధికారులే ఇలా వ్యవహరిస్తే ఏమనాలి?’
- తెదేపా నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?