Subhash Chandra Bose: కాలేజీ గలాటా... మారిన బోస్ బాట
సంపన్న కుటుంబం. తండ్రి బ్రిటిష్ ప్రభుత్వ న్యాయవాది! ఆంగ్లేయులకు విశ్వాసపాత్రుడు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా బాల్యమంతా... దాదాపు తెల్లవారిలా పెరిగాడు. వారితోనే కలసి చదివాడు.
సంపన్న కుటుంబం. తండ్రి బ్రిటిష్ ప్రభుత్వ న్యాయవాది! ఆంగ్లేయులకు విశ్వాసపాత్రుడు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా బాల్యమంతా... దాదాపు తెల్లవారిలా పెరిగాడు. వారితోనే కలసి చదివాడు. అలాంటి సుభాష్చంద్ర బోస్... ఆంగ్లేయులకెలా వ్యతిరేకమయ్యాడనేది ఆసక్తికరం! కాలేజీ రోజుల్లో జరిగిన ఓ ఘటన బోస్ బాటను మళ్లించింది.
ప్రభావతీబోస్, జానకీనాథ్ బోస్ల 14 మంది సంతానంలో తొమ్మిదోవాడు సుభాష్చంద్ర బోస్. 1897 జనవరి 23న ఆయన పుట్టే నాటికి జానకీనాథ్ బ్రిటిష్ ప్రభుత్వ ప్లీడర్గా కటక్లో పనిచేసేవారు. పండగలకు తమ సొంతూరు కోల్కతాకు వెళ్లేవారు. సుభాష్ బాల్యమంతా కటక్లోనే సాగింది. ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్లో... ఇంగ్లిష్, లాటిన్, బైబిల్, బ్రిటిష్ చరిత్ర చదువుకున్నాడు. ఇంట్లో తల్లి ద్వారా మహాభారతం, రామాయణం, బెంగాలీ కథలు, దుర్గా, కాళీ, రామకృష్ణ పరమహంస, వివేకానందుడి గురించి తెలిసింది. 12 ఏళ్ల వయసులో బడి మారటంతో అక్కడ బెంగాలీ, సంస్కృతాలతో పరిచయమైంది. మెట్రిక్యులేషన్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో అగ్రశ్రేణిలో నిలిచాడు. ఈ క్రమంలో తండ్రి ఆయన్ను సంపన్నులు చదివే కోల్కతాలోని ప్రఖ్యాత ప్రెసిడెన్సీ కళాశాలలో పాశ్చాత్య తత్వశాస్త్ర కోర్సులో చేర్చారు.. అలా బోస్ పయనం తండ్రి కోరుకున్న బాటలోనే కొనసాగింది.
నోరుజారిన ప్రొఫెసర్..
1916 ఫిబ్రవరిలో ఓ రోజు... చరిత్ర ఆచార్యుడు ఎడ్వర్డ్ ఫేర్లీ ఓటెన్ పాఠం చెబుతూ.. భారతీయ సంస్కృతి, భారతీయుల గురించి నీచంగా మాట్లాడాడు. కొంతమంది భారతీయ విద్యార్థులపై చేయి కూడా చేసుకున్నాడు. ఇది 19 ఏళ్ల బోస్తో పాటు అనేక మంది భారతీయ విద్యార్థుల రక్తాన్ని ఉడికించింది. కొద్దిరోజుల తర్వాత విద్యార్థులంతా ఓటెన్ను కాలేజీ మెట్లపై నుంచి తోసేసి... దాడిచేసినంత పనిచేశారు. గాయాలేమీ కానప్పటికీ తనను కొట్టిందెవరో ఓటెన్ గుర్తించలేకపోయాడు. కాలేజీ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. చివరకు.. ఆ రోజు సంఘటన తర్వాత బోస్ అక్కడి నుంచి పారిపోతుంటే చూశామంటూ అటెండర్ సాక్ష్యం చెప్పటంతో... ఆయనే ఈ దాడికి సూత్రధారి, పాత్రధారి అని బోస్ను కాలేజీ నుంచే కాకుండా... కోల్కతా యూనివర్సిటీ నుంచే బహిష్కరించారు. బోస్లో ఈ సంఘటన జాతీయ భావనలను రేకెత్తించగా... ఆయన తండ్రి దీన్ని అవమానంగా భావించారు. అప్పటికే జాతీయోద్యమం, విప్లవవాదం బెంగాల్లో విస్తృతమయ్యాయి. ఉడుకురక్తం ఎటు పరుగులు పెడుతుందోననే ఆందోళనతో జానకీనాథ్ తన మిత్రుడైన కోల్కతా వర్సిటీ వైస్ ఛాన్స్లర్ అశుతోష్ ముఖర్జీతో మాట్లాడారు. చివరకు బోస్కు మరో కాలేజీలో (స్కాటిష్ చర్చ్ కాలేజీ) మళ్లీ సీటు ఇప్పించారు. 1918లో తత్వశాస్త్రంలో బీఏ(ఆనర్స్)ను ప్రథమశ్రేణిలో పాసైన ఆయన్ను తండ్రి వెంటనే ఇంగ్లాండ్కు పంపించారు. అక్కడ ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ఐసీఎస్) పరీక్షకు కూర్చోబెట్టారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరటంతో పాటు... ఐసీఎస్కూ సిద్ధమయ్యాడు బోస్. ఆ ఏడాది (1920) ఐసీఎస్లో కేవలం ఆరు సీట్లు మాత్రమే ఉండగా... ఓపెన్ కాంపిటేషన్లో నాలుగోస్థానంలో నిలిచి ఐసీఎస్ ప్రొబెషనర్గా ఎంపికయ్యాడు. మరో రెండు సబ్జెక్ట్లు, గుర్రపు స్వారీ పరీక్ష పూర్తి చేస్తే ఐసీఎస్ అధికారిగా భారత్కు వచ్చేయటమే మిగిలి ఉందిక!
నాకొద్దు ఐసీఎస్
ఈ దశలో... బోస్లో మళ్లీ జాతీయ భావనలు పురివిప్పాయి. తండ్రికి, అన్నయ్య శరత్చంద్రబోస్కు లేఖలు రాశారు. తన ప్రగతిశీల ఆలోచనలకు ఇది పొసగదని... ఈ ఐసీఎస్ సంకెళ్లతో దేశానికి సేవ చేయలేనని తన అశక్తతను వ్యక్తంజేశారు. చివరకు 1921 ఏప్రిల్లో ఐసీఎస్ తుది పరీక్ష రాయబోనని నిర్ణయించుకున్నారు. అదే విషయం కుటుంబంతో పాటు బ్రిటన్లో భారత వ్యవహారాల మంత్రి ఎడ్విన్ మాంటెగూకు సైతం స్పష్టం చేశారు. ‘నా పేరును ఐసీఎస్ ప్రొబెషనర్ల జాబితా నుంచి తొలగించండి. ఇప్పటిదాకా నాపై బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ఖర్చును తిరిగి ఇచ్చేస్తాను’ అంటూ మాంటెగూకు లేఖ రాశారు బోస్. చివరకు కేంబ్రిడ్జిలో కూడా తన చదువును పూర్తి చేయకుండానే భారత్కు తిరిగి వచ్చి జాతీయోద్యమంలో చేరారు.
1945లో విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ చనిపోయారనే విషయం తెలిశాక... కాలేజీ నుంచి తన బహిష్కరణకు కారణమైన ప్రొఫెసర్ ఎడ్వర్డ్ ఓటెన్ సంతాప సందేశం పంపటం విశేషం. బోస్ సేవలను, ధైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని కీర్తిస్తూ.. గ్రీకు వీరుడితో ఆయన్ను పోలుస్తూ.. ఇంగ్లాండ్లో విశ్రాంత జీవితం గడుపుతున్న ఓటెన్ ఘన నివాళి అర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు. -
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల విచారణ నుంచి...
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
929 మంది వాలంటీర్లను తొలగించాం
ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్)ని ఉల్లంఘించినందున 929 మంది వాలంటీర్లను తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు నివేదించారు. -
సంక్షిప్త వార్తలు
సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ను పోలీసు కస్టడీకి ఇస్తూ విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులిచ్చింది. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే!
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’