ఉచిత హామీలు ఆందోళనకరమే!
ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలూ పోటీపడుతూ ఉచిత హామీలు ఇస్తున్నాయి. నిస్సందేహంగా ఇది తీవ్రమైన సమస్యే. అయితే, దీనిని నియంత్రించడం ఎలా? ఎన్నికల ప్రక్రియలో ఇది అసమానమైన విధానాన్ని సృష్టిస్తోంది.
వాగ్దానాల బడ్జెట్ అసలు బడ్జెట్ను మించిపోతోంది
ఈ అంశంలో పార్టీలను నియంత్రించడం ఎలా?
కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలూ పోటీపడుతూ ఉచిత హామీలు ఇస్తున్నాయి. నిస్సందేహంగా ఇది తీవ్రమైన సమస్యే. అయితే, దీనిని నియంత్రించడం ఎలా? ఎన్నికల ప్రక్రియలో ఇది అసమానమైన విధానాన్ని సృష్టిస్తోంది. ఈ అంశంలో న్యాయస్థానం పరిధి పరిమితమే. కట్టడి చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని గతంలోనే ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.
- జస్టిస్ ఎన్.వి.రమణ
దిల్లీ: ఎన్నికలకు ముందు ప్రజాధనంతో నిర్హేతుకమైన ఉచిత పథకాలను అమలుచేస్తున్న రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సమాధానమివ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అటువంటి రాజకీయ పక్షాల ఎన్నికల గుర్తును నిలిపివేయాలని, ఆ పార్టీల రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ధర్మాసనంలో జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీ సభ్యులుగా ఉన్నారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉచిత హామీల బడ్జెట్ సాధారణ బడ్జెట్ను మించిపోతోంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్థానం తీర్పు తర్వాత ఉచిత హామీల అంశంపై ఎన్నికల సంఘం ఒకే ఒక సమావేశం నిర్వహించిందని, మార్గదర్శకాలు రూపొందించినా వాటిలో పస లేదని పిటిషనర్ అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు. ‘అధికారాన్ని నిలుపుకొనేందుకు ఎన్నికల ముందు ప్రజాధనంతో అనుచిత ఉచిత హామీలను అమలుచేసేందుకు యత్నించే పార్టీల గుర్తింపును రద్దు చేయడం, లేదా ఎన్నికల గుర్తులను నిలిపివేయడం, అవసరమైతే ఈ రెండు చర్యలు కలిపి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టం రూపొందించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘కొంత సమయం వేచి చూద్దాం. ప్రస్తుతం ఈ పిటిషన్పై స్పందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తున్నాం’ అని తెలిపింది. ఎన్నికల్లో పోటీపడి హామీలిస్తున్న రాజకీయ పార్టీలను కూడా ఈ వ్యాజ్యంలో కక్షిదారులుగా చేర్చాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడింది. అన్ని రాజకీయ పార్టీలు నిర్హేతుక ఉచిత హామీలను ఇస్తున్నప్పుడు అఫిడవిట్లో కొన్ని పార్టీలు, కొన్ని రాష్ట్రాల పేర్లను మాత్రమే ప్రస్తావించడంపై అనుమానం వ్యక్తం చేసింది. అయితే, పిటిషనర్ లేవనెత్తాలనుకున్న విషయం తీవ్రమైనది కాబట్టి కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసు జారీ చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
పిటిషన్లో ఏముంది?
ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ వేర్వేరు రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ భాజపా నేత, న్యాయవాది అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ ...18ఏళ్ల వయసు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి ఇస్తామంటే.. ప్రతి మహిళకు రూ.2వేలు ఇవ్వనున్నట్లు శిరోమణి అకాలీదళ్ వాగ్దానం చేసిందని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో గృహిణికి నెలకు రూ.2 వేలు, ఏడాదికి 8 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కళాశాలకు వెళ్లే ప్రతి అమ్మాయికి స్కూటీ, 12వ తరగతి ఉత్తీర్ణులైన వారికి రూ.20 వేలు, 10వ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత రూ.15 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ కోసం ప్రత్యేకంగా.. 12వ తరగతి చదివే అమ్మాయిలకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పించిందని వివరించారు. డబ్బు పంపిణీ, ఉచిత వాగ్దానాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని పిటిషనర్ ఆందోళనవ్యక్తం చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉచిత, నిర్హేతుక వాగ్దానాలు ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘన అని, మితిమీరిన ప్రభావానికి గురి చేయడమేనంటూ ప్రకటించాలని అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ కోరారు. ఒక్కో పౌరుడిపై సుమారు రూ.3 లక్షలు రుణ భారం ఉన్నరాష్ట్రాలూ ఉన్నాయని.. అయినప్పటికీ.. ఇంకా ఉచితాలను అందిస్తున్నాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?