ఫిట్మెంట్కు ఎప్పుడు అంగీకరించాం?
ప్రభుత్వం దగ్గర ఫిట్మెంట్కు తాము ఎక్కడా అంగీకరించలేదని పీఆర్సీ సాధన సమితి నేతలు స్పష్టం చేశారు. తాము ఎక్కడన్నా ఫిట్మెంట్కు అంగీకరించినట్లు ఉంటే దాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ఉత్తర్వులకు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వం దగ్గర ఫిట్మెంట్కు తాము ఎక్కడా అంగీకరించలేదని పీఆర్సీ సాధన సమితి నేతలు స్పష్టం చేశారు. తాము ఎక్కడన్నా ఫిట్మెంట్కు అంగీకరించినట్లు ఉంటే దాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. చీకటి ఉత్తర్వులను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. విజయవాడలో మహాత్మాగాంధీరోడ్డు డీటీసీ కార్యాలయం ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి సాధన సమితి రాష్ట్ర నేతలు వినతిపత్రాలు సమర్పించారు. ప్రభుత్వానికి సద్బుద్ధిని ప్రసాదించి, తమ న్యాయమైన కోర్కెలు తీర్చేలా దిశా నిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రజా రవాణాశాఖ (పీటీడీ) ఎన్ఎంయూఏ సెంట్రల్ కమిటీ, విజయవాడలోని రెవెన్యూ సంఘ కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర నేతలు సమావేశమై, ఉద్యమ కార్యాచరణ అమలుపై చర్చించారు. ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై పీఆర్సీ సాధన సమితి నేతలకు ఎన్ఎంయూఏ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఉద్యమానికి ఆర్టీసీ ఉద్యోగులు మద్దతు తెలిపారు. ఈ నెల 30 వరకు జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు ర్యాలీలు, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు.
ఉద్యమ నేతలను ప్రభుత్వం అరెస్టు చేయొచ్చు: బండి శ్రీనివాసరావు
‘ప్రభుత్వం రకరకాల విన్యాసాలు చేస్తోంది. ఉద్యమ నేతల ఇళ్లపై దాడులు చేయొచ్చు. ఉద్యమం చేయకుండా మమ్మల్ని అరెస్టులు చేయొచ్చు. దేనికీ భయపడం. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ సాధనే మా ధ్యేయం. ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. పీఆర్సీ అంటే వేతనాలు పెరగాలి గానీ తగ్గకూడదని అధికారులకు తెలియదా? ఇప్పటికే చాలా ఓపిక పట్టాం. ఇంకా ఆగితే మాకు బడితె పూజ చేసేలా పరిస్థితి ఉంది. ఇంత వరకు మేం ఆర్థిక మంత్రి బుగ్గన ముఖమే చూడలేదు. మా బాధను మంత్రి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఒక్కటే సమస్య. ఆర్టీసీ ఉద్యోగులకు అన్నీ సమస్యలే. వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. ఆర్టీసీ ఉద్యోగుల్లో కండక్టర్లు, మెకానిక్లు వంటి వారి జీతాల ఖరారుపై అశుతోష్మిశ్రా నివేదికలో ఉన్నా దాన్ని బయటపెట్టడం లేదు’ అని సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు అన్నారు. ఆర్టీసీ కార్మికులతోనే నాడు సమైక్యాంధ్ర ఉద్యమం విజయవంతమైంది.. ఇప్పుడు ఈ సమ్మెనూ వారే విజయవంతం చేయాలని కోరారు. ‘ప్రభుత్వం మా మాటలు వినడం లేదు. అందువల్లే అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చాం. జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలి’ అని ఏపీ ఐకాస ప్రధాన కార్యదర్శి హృదయరాజు అన్నారు.
పాత జీతాలిస్తే రూ.10 వేల కోట్లు మిగులు: బొప్పరాజు
‘పాత జీతాలిస్తే ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లు మిగులుతాయి. పీఆర్సీ నివేదికను బయటపెడితే వాస్తవాలు బహిర్గతమవుతాయని ప్రభుత్వం భయపడుతోంది. జనవరి నెల జీతం ఇవ్వకూడదని.. జీతాలు రాకపోతే ఉద్యోగులే మాపై తిరగబడతారని భావిస్తోంది. మా ఉద్యమాన్ని అణిచివేసేందుకు జిల్లాల విభజన తీసుకొచ్చారని మేం అనుకోవడం లేదు. విభజన పనిని ఉద్యోగులు చేయగలిగినంత చేస్తారు. వారిపై ఒత్తిడి తీసుకురావద్దని కలెక్టర్లను కోరుతున్నాం. ఉద్యోగుల్లో అసహనం కలిగేలా చేసి ఉద్యమాన్ని దెబ్బతీయాలని కుట్ర పన్నుతోంది. వైద్య ఆరోగ్యం, ఆర్టీసీ వంటి కీలక శాఖలను ఉద్యమంలోకి తీసుకురావాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. మీరు బ్రహ్మాస్త్రం వంటివారు. మిమ్మల్ని వాడితే పరిస్థితులు తిరగబడాల్సిందే. జీతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. పీఆర్సీ ఇచ్చేది జీతాలు తగ్గించడానికా? పెంచడానికా? మేం ఎక్కడన్నా ఫిట్మెంట్కు అంగీకరించినట్లు ఉంటే దాన్ని బయటపెట్టాలి’ అని వెల్లడించారు.
పీఆర్సీ ఉత్తర్వులపై పునరాలోచించాలి
‘పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని మంత్రుల కమిటీని కోరాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్ల ప్రయోజనం దృష్ట్యా పీఆర్సీపై ప్రభుత్వం పునరాలోచించాలి’ అని ఆర్టీసీˆ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు వైవీరావు తెలిపారు. ‘పీటీడీ ఉద్యోగులకు సంబంధించిన ఏ అంశాలు పీఆర్సీలో ఉన్నాయో చెప్పడం లేదు. పీఆర్సీ సాధన సమితి ఉద్యమంలో పాలుపంచుకొని, సమ్మెలో పాల్గొనేలా మా సంఘం సెంట్రల్ స్టీరింగ్ కమిటీ తీర్మానం చేసింది. రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తే ప్రజలు ఇబ్బందులు పడేందుకు ప్రభుత్వమే కారణమవుతుంది. ఒకటి, రెండు రోజుల్లో అన్ని ఆర్టీసీ సంఘాలు మాట్లాడుకొని కార్మికులంతా ఉద్యమంలో పాల్గొనేలా చూస్తాం’ అని ఎన్ఎంయూఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు