New District:ఉగాది నాటికి కొత్త జిల్లాలు
రాష్ట్రంలో ఉగాది నాటికి కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటవుతాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రకటించారు. ఇందులో రెండు ప్రత్యేకంగా గిరిజన ప్రాంత జిల్లాలుగా ఉంటాయని వివరించారు. సుపరిపాలన, పౌరసేవలు మరింత
ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉద్యోగులకు ఫిట్మెంట్
2023 నాటికి పోలవరం పూర్తి
గణతంత్ర వేడుకల్లో గవర్నర్ వెల్లడి
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఉగాది నాటికి కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటవుతాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రకటించారు. ఇందులో రెండు ప్రత్యేకంగా గిరిజన ప్రాంత జిల్లాలుగా ఉంటాయని వివరించారు. సుపరిపాలన, పౌరసేవలు మరింత మెరుగ్గా అందించేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటితో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26కి పెరుగుతుందని గవర్నర్ వివరించారు. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు.
ఉద్యోగులకు మంచి పీఆర్సీ
‘రాష్ట్ర విభజనతో రెవెన్యూ లోటు, కొవిడ్ కారణంగా సొంత వనరులు తగ్గినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత పరిస్థితుల్లో మంచి పీఆర్సీని ప్రకటించింది. 23% ఫిట్మెంట్ ప్రయోజనం కల్పించడంతోపాటు ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు, గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచింది. 2019లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 27% ఐఆర్ మంజూరు చేసింది. ఆర్థిక సమస్యలున్నా 11వ వేతన సవరణ కమిషన్ను అమలు చేస్తున్నాం. ఈ కారణంగా ప్రభుత్వ ఖజానాపై రూ.10,247 కోట్ల ఆర్థిక భారం పడనుంది’ అని గవర్నర్ పేర్కొన్నారు.
32 నెలల్లో ప్రజలకు రూ.1,67,798 కోట్లు పంపిణీ
‘ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ), ప్రత్యక్షేతర ప్రయోజన బదిలీ విధానంలో 32 నెలల్లో రికార్డు స్థాయిలో 9,29,15,170 మంది లబ్ధిదారులకు రూ.1,67,798 కోట్లు పంపిణీ చేశాం’ అని అన్నారు.
‘వివిధ సంక్షేమ పథకాల కింద రైతులకు ఇప్పటి వరకు రూ.86,313 కోట్ల సాయం అందించాం. అమూల్ భాగస్వామ్యంతో రైతుకు లీటరు పాలకు రూ.5 నుంచి రూ.15 అదనపు ఆదాయం వస్తోంది’ అని గవర్నర్ వివరించారు.
పొరుగు రాష్ట్రాలకు స్ఫూర్తిగా ‘నాడు- నేడు’
‘విద్య పథకాల కింద ఇప్పటి వరకు 1,99,38,694 మందికి రూ.34,619.24 కోట్ల లబ్ధి చేకూర్చాం. మన బడి నాడు-నేడు పథకంలో రూ.16,025 కోట్లు వెచ్చించి పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాం. రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వైఎస్ఆర్ పింఛన్ కానుక కింద ఇప్పటివరకు రూ.45,837 కోట్లు సమకూర్చాం. విడతల వారీగా పెంచుతూ నెలకు రూ.3 వేల పింఛను అందించడమే ప్రభుత్వ లక్ష్యం’ అని హరిచందన్ అన్నారు.
కొప్పర్తిలో మెగా పారిశ్రామిక హబ్
‘రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తి సమీపంలో 3,155 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధి చేయబోతున్నాం. భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం వద్ద మూడు పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.13 వేల కోట్లు వ్యయం చేయాలని భావిస్తోంది’ అని గవర్నర్ పేర్కొన్నారు.
వచ్చే ఏడాది పోలవరం పూర్తి!
‘పోలవరం ప్రాజెక్టును 2023 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భూసేకరణ, పునరావాస కాలనీల నిర్మాణం జరుగుతోంది. వెలిగొండ టన్నెల్-1ను 2022 ఖరీఫ్కు ప్రారంభిస్తాం. ప్రభుత్వం తాగు, సాగునీటి కోసం రూ.74,920 కోట్లతో ప్రాధాన్యక్రమంలో 54 ప్రాజెక్టులను చేపడుతోంది’ అని గవర్నర్ వెల్లడించారు.
ప్రజలే ప్రభుత్వం.. అదే రాజ్యాంగ సిద్ధాంతం
ముఖ్యమంత్రి జగన్
ఈనాడు, అమరావతి: ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు.. ఈ సిద్ధాంతంపైనే భారత రాజ్యాంగం రూపుదిద్దుకుని ప్రజాస్వామ్యాన్ని మనకు అందించింది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ట్వీట్ చేశారు. ఈ మహోన్నత రాజ్యాంగాన్ని మనకు అందించిన దార్శనికులను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అని తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం జాతీయ పతాకావిష్కరణ చేశారు. ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కె.ధనుంజయ రెడ్డి, ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ, ఓఎస్డీ పి.కృష్ణమోహన్ రెడ్డి, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
* సచివాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్శర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సచివాలయ ప్రధాన భద్రతాధికారి కృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్