కొద్దిగా తగ్గిన కేసులు.. పాజిటివిటీ

రాష్ట్రంలో రెండోరోజూ కొవిడ్‌ కేసులు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 49,143 నమూనాలు పరీక్షించారు. వీటిద్వారా 13,618 కొవిడ్‌ కేసులు గుర్తించారు. పాజిటివిటీ రేటు

Published : 27 Jan 2022 02:50 IST

తాజాగా 13,618 మందికి కొవిడ్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో రెండోరోజూ కొవిడ్‌ కేసులు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 49,143 నమూనాలు పరీక్షించారు. వీటిద్వారా 13,618 కొవిడ్‌ కేసులు గుర్తించారు. పాజిటివిటీ రేటు 27.7%గా నమోదైంది. మంగళవారం పాజిటివిటీ రేటు 29.44%గా ఉంది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,791, అనంతపురంలో 1,650 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తక్కువగా విజయనగరం జిల్లాలో 466, చిత్తూరు జిల్లాలో 493 చొప్పున కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. కొవిడ్‌తో 9 మంది మరణించారు.  8,687 మంది కోలుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని