ఐఏఎస్ కేడర్ రూల్స్ మార్పునకు వ్యతిరేకం 9.. అనుకూలం 8
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐఏఎస్ కేడర్ నిబంధనల మార్పుపై ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు తమ స్పందనలను తెలియజేశాయి. వాటిలో 9 రాష్ట్రాలు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించగా...మరో 8 రాష్ట్రాలు
కేంద్రం ప్రతిపాదనకు ఇప్పటి వరకూ సమాధానమిచ్చిన రాష్ట్రాలివీ
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐఏఎస్ కేడర్ నిబంధనల మార్పుపై ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు తమ స్పందనలను తెలియజేశాయి. వాటిలో 9 రాష్ట్రాలు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించగా...మరో 8 రాష్ట్రాలు సమర్థించాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరో సారి ఈ విషయాన్ని గుర్తు చేస్తామని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. రాష్ట్ర కేడర్ నుంచి వచ్చి కేంద్రంలో డిప్యుటేషన్పై పనిచేసే అధికారుల సంఖ్య తగ్గిపోతుందని పేర్కొంటూ ఐఏఎస్ కేడర్ రూల్స్-1954కు మార్పులను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటి వరకూ పరస్పర సంప్రదింపుల ద్వారా కేంద్రం, రాష్ట్రాలు అధికారుల డిప్యుటేషన్కు అనుమతులిచ్చేవి. అయితే, తాజా ప్రతిపాదన ప్రకారం.. ఏ అధికారినైనా డిప్యుటేషన్పై పంపించాలని కేంద్రం కోరితే ఆ అభ్యర్థనను తోసిపుచ్చే అవకాశం ఇక రాష్ట్రాలకు ఉండదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలపాలని కోరుతూ గత ఏడాది డిసెంబరు 20, 27, ఈ ఏడాది జనవరి 6,12 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం లేఖలు రాసింది. బుధవారం వరకు అభిప్రాయాలు చెప్పిన రాష్ట్రాల్లో 9.. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించలేదు. ఇవన్నీ భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కావడం గమనార్హం. వీటిలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, రాజస్థాన్ ఉన్నాయి. కేంద్రం ప్రతిపాదనకు సానుకూలత తెలిపిన రాష్ట్రాల్లో ...అరుణాచల్ప్రదేశ్, మణిపుర్, త్రిపుర, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, హరియాణా, హిమాచల్ప్రదేశ్ ఉన్నాయి.
* కర్ణాటక, మేఘాలయ రాష్ట్రాలు ప్రాథమికంగా కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకించినప్పటికీ ఆ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
* బిహార్ కూడా తొలుత ఐఏఎస్ సర్వీసు నిబంధనల మార్పును అంగీకరించబోమని పేర్కొంది.
* కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్పై తగినంత మంది అధికారులను రాష్ట్రాలు కేటాయించకపోవడం వల్లే ఐఏఎస్ అధికారుల సర్వీసు నిబంధనల్లో మార్పులను ప్రతిపాదించాల్సి వచ్చిందని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు,శిక్షణ విభాగం వర్గాలు అంటున్నాయి. కేంద్రంలో సంయుక్త కార్యదర్శి స్థాయి ఐఏఎస్ అధికారుల ప్రాతినిధ్యం తగ్గిపోతోందని, సెంట్రల్ డిప్యుటేషన్ రిజర్వు(సీడీఆర్)కు తమ వంతు అధికారులను చాలా రాష్ట్రాలు కేటాయించడంలేదని చెబుతున్నాయి.
* కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన అమల్లోకి వస్తే రాష్ట్రాల్లో పరిపాలన కుంటుపడుతుందని, అభివృద్ధి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఒడిశా ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరి సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికే విరుద్ధమని తమిళనాడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్