జనవరి జీతాలపై గరం గరం
కొత్త వేతన సవరణ ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నెల జీతాలు, పింఛన్లు చెల్లించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అందుకు ఆర్థిక, ఖజానా శాఖల అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు కొత్త జీతాలు
సీఎఫ్ఎంఎస్లోనే పింఛను బిల్లులు
ట్రెజరీ అధికారులు సరిచూసి పంపాలని ప్రభుత్వ ఆదేశాలు
ఈనాడు, అమరావతి: కొత్త వేతన సవరణ ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నెల జీతాలు, పింఛన్లు చెల్లించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అందుకు ఆర్థిక, ఖజానా శాఖల అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు కొత్త జీతాలు, పింఛన్లు వద్దని పీఆర్సీ సాధన సమితి నాయకులు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగీ తమకు పాత విధానంలోనే జనవరి జీతాలు ఇవ్వాలని కోరుతూ తమతమ డ్రాయింగ్ డిస్బర్సుమెంటు అధికారులకు లిఖితపూర్వకంగా విన్నవించాలని సూచిస్తున్నారు. ఇందుకు ఒక నమూనా సిద్ధం చేయనున్నారు. మరోవైపు ఆర్థిక, ఖజానా శాఖల ఉన్నతాధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఖజానా అధికారులు, ఉద్యోగుల బిల్లులు సమర్పించేందుకు జనవరి 28 (నేటి వరకు) ప్రభుత్వం గడువు విధించింది. డీడీవోలు ఎన్ని బిల్లులు సమర్పించారు? ఎంతమంది అధికారులు వాటిని ప్రాసెస్ చేశారన్న విషయాలపై గురువారం మధ్యాహ్నం ఖజానా శాఖ డైరెక్టర్ మోహన్రావు సమీక్షించారు. అన్ని జిల్లాల అధికారులు, సబ్ట్రెజరీ అధికారులతో వీడియో సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని 3,57,528 మంది పింఛనర్ల జనవరి నెల పింఛన్లు కొత్త వేతన స్కేళ్ల ప్రకారమే ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే సీఎఫ్ఎంఎస్లో ఆ బిల్లులన్నీ సిద్ధమయ్యాయి.
జీతాల పరిస్థితి ఏంటి?
రాష్ట్రంలోని 18,000 డ్రాయింగ్ డిస్బర్సుమెంట్ అధికారుల్లో ఎంతమంది బిల్లులు సమర్పించారనే అంశాన్ని ఉన్నతాధికారులు సమీక్షించారు. ప్రధానంగా వచ్చిన బిల్లుల్లో అధికం పోలీసుశాఖవే ఉన్నాయని తెలిసింది. ఏ సబ్ట్రెజరీ పరిధిలో డీడీవోలు ఎన్ని బిల్లులు సమర్పించారో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు పరిశీలించి కొందరితో నేరుగా మాట్లాడారు. బిల్లుల ప్రక్రియ ఎందుకు పూర్తి చేయట్లేదని ప్రశ్నించారు. ఉద్యోగుల ఎస్ఆర్లు పంపాలని కోరితే వారి నుంచి రాలేదని, అందువల్ల వాటిని తాము ప్రాసెస్ చేయలేకపోతున్నామని వారిలో కొందరు చెప్పారు. ఎస్ఆర్లు రాకున్నా ఖజానా అధికారుల వద్ద ఉన్న ఫ్లైలీఫ్ ఆధారంగా ఆ పని పూర్తి చేయాలని ఖజానా శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఖజానా అధికారులు ఆ శాఖ బిల్లులు ఎందుకు సిద్ధం చేయలేదనీ ఉన్నతాధికారులు ప్రశ్నించారు. జనవరి 28 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చిందని, లేకుంటే చర్యలు తీసుకుంటారని అధికారులు వారికి చెప్పినట్లు తెలిసింది.
పింఛన్లు తీసుకోవద్దు
‘పాత పీఆర్సీ విధానంలోనే తమకు పింఛన్లు ఇవ్వాలని రాష్ట్రంలోని విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. కొత్త విధానంలో పింఛన్లు ఇచ్చినా, సోదర ఉద్యోగులు ఆందోళన విరమించి అనుమతించే వరకూ ఆ సొమ్ములు డ్రా చేయకూడదని నిర్ణయించాం. ఈ మేరకు పింఛనుదారులకు విన్నవిస్తున్నాం.’
- ఈదర వీరయ్య, రాష్ట్ర పింఛనుదారుల చర్చావేదిక రాష్ట్ర అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు