Strike: మేము సైతం సమ్మెకు..
ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. సమ్మెకు అన్ని సంఘాల నుంచీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ, వైద్య-ఆరోగ్య శాఖల ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉద్యమానికి సంఘీభావంగా
సై అన్న ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖల ఉద్యోగులు
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన రిలే దీక్షలు
3న చలో విజయవాడ.. బీఆర్టీఎస్ రోడ్డులో సభ
ఈనాడు - అమరావతి
ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. సమ్మెకు అన్ని సంఘాల నుంచీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ, వైద్య-ఆరోగ్య శాఖల ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉద్యమానికి సంఘీభావంగా ఫిబ్రవరి 1, 2 తేదీల్లో అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఉద్యమ కార్యాచరణలో భాగంగా పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఈనెల 30 వరకు ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉద్యోగులు రిలే దీక్షలు చేశారు. కొన్ని జిల్లాల్లో పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. నెల్లూరులో జరిగిన దీక్షలకు ఉద్యోగినులు భారీగా హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిబ్రవరి 3న నిర్వహించే ‘చలో విజయవాడ’ను విజయవంతం చేసేందుకు సాధన సమితి సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో రాష్ట్రవ్యాప్తంగా వేల మందితో సభ నిర్వహించాలని పట్టుదలతో ఉన్నారు. ఇదేసమయంలో పాత జీతాలే చెల్లించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా డీడీవోలకు ఉద్యోగులు లక్షల అభ్యర్థన పత్రాలను సమర్పించారు. ఎస్జీటీ ఉపాధ్యాయులు ఎంఈవోలకు, స్కూల్ అసిస్టెంట్లు ప్రధానోపాధ్యాయులకు పత్రాలను ఇచ్చారు.
గిరిజన గురుకులాల ఉపాధ్యాయుల మద్దతు
పీఆర్సీ సాధన సమతి ఉద్యమానికి తాము మద్దతు తెలియజేస్తున్నట్లు గిరిజన సంక్షేమ గురుకులాల ఉపాధ్యాయులు, లెక్చరర్లు, బోధనేతర, పొరుగు సేవల సిబ్బంది తెలిపారు.
ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నం
ఏదోవిధంగా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగ సంఘాలు చర్చలకు రావడం లేదని తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రభుత్వానికి మూడు డిమాండ్లపై ఇప్పటికే స్పష్టంగా లేఖ ఇచ్చాం. ఐఆర్ను ఇచ్చినట్లు ఇచ్చే వెనక్కి తీసుకున్న చరిత్ర ప్రభుత్వానిది. ఇంత దారుణంగా ఉద్యోగ సంఘాలను అవమానపర్చడాన్ని ఎప్పుడూ చూడలేదు. జీతాలు చెల్లించకపోతే ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో అసహనం వచ్చి, ఉద్యమం నీరుగారుతుందని భావిస్తున్నారేమో.. అదేమీ ఉండదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాత జీతాలనే ఇవ్వాలి. మేం చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఎవరికీ లొంగలేదు. మా వెనుక ఉద్యోగులు తప్ప ఎవరూ లేరు.
-ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
మీరు మెట్లు దిగాల్సిన అవసరంలేదు
మీరు మెట్లు దిగాల్సిన అవసరం లేదు. మీ పీఠంపైనే కూర్చోండి. 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లు కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించుకోవాలంటే మూడు డిమాండ్లు అమలు చేసి, చర్చలకు పిలవండి. సినిమాటిక్, నాటకీయ ప్రకటనలు పక్కనపెట్టి, ఆచరణాత్మక పరిష్కారం చూడాలి. సర్కారు వేసిన కమిటీ సమస్యలను పరిష్కరించేది కాదు. కేవలం మాతో చర్చించి, ఆ విషయాలను సీఎంకు చెప్పే కమిటీ మాత్రమే. మా డిమాండ్లను సాకుగా చూపి జీతాలను ఆపేందుకు, ఆ డబ్బులను పథకాలకు మళ్లించుకునేందుకు ఇలా చేస్తోంది. రిలే నిరాహార దీక్షలు యథావిధిగా కొనసాగుతాయి. కాగితాలపై పుట్టుకొచ్చిన సంఘాలతో చర్చించి, న్యాయం చేసినా మంచిదే.
-ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
వైషమ్యాలు సృష్టించేందుకు కుట్ర
బండి శ్రీనివాసరావు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ఉద్యోగ సంఘాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆరోపించారు. నాలుగు ఐకాసలు, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను రెండో రోజైన శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడుతూ... ‘‘పీఆర్సీ అంటూ కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నారు. నాలుగు సంఘాలు ఏకతాటిపై ఉన్నాయి. జీతాలు చెల్లించేందుకు కొందరు డీడీవోలు, కలెక్టర్లు ప్రయత్నిస్తున్నారు. పరిధి దాట్టొదు.. మీ ప్రవర్తనను అదుపులో పెట్టుకోవాలి. మాకు పాత జీతాలు ఇస్తే చాలు. మూడు డిమాండ్లు పరిష్కరిస్తేనే చర్చలకు వస్తాం’ అని స్పష్టంచేశారు.
ఉద్దేశపూర్వకంగా కరపత్రాలు
మాకు, ప్రజలకు మధ్య యుద్ధం కల్పించాలనే ఉద్దేశంతో కరపత్రాలు ముద్రించారు. ఆర్టీసీ, వైద్యశాఖ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. కొవిడ్ సమయంలో వైద్యం అందక ఎవరైనా చనిపోతే దానికి ప్రభుత్వానిదే బాధ్యత.
-ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి శివారెడ్డి
డీడీవోలపై చర్యలు తీసుకుంటే... ఆ క్షణం నుంచే సమ్మె
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
ఈనాడు, అమరావతి: పీఆర్సీపై ప్రభుత్వం సామరస్య పూర్వకంగా వ్యవహరించకుండా ఉద్యోగులను రెచ్చగొడుతోందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. చర్చల పేరిట కొన్ని సంఘాలను పిలిపించి మాట్లాడినంత మాత్రాన ఆ సంఘాలు ఉద్యమాన్ని ఆపుతాయా? అని ప్రశ్నించారు. కొత్త జీతాల బిల్లులు చేయాలని ఖజానా ఉద్యోగులపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి వారిపై చర్యలు తీసుకుంటే... ఆ క్షణం నుంచే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈమేరకు ఏపీ సచివాలయంలో ఉద్యోగులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. శుక్రవారం భోజన విరామ సమయంలో... రివర్స్ పీఆర్సీని నిలిపేయాలని నినాదాలు చేస్తూ వెనక్కి నడిచారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... ‘‘కొత్త జీతంలో అయిదు డీఏలు కలపడంవల్ల కొంత జీతం పెరిగితే, ఉద్యోగులు నిరసన తెలపరని భావిస్తున్నట్లుంది. ఉద్యోగులు అమాయకులు కాదు. పీఆర్సీపై చర్చల పేరిట కొన్ని సంఘాలను ప్రభుత్వం వేసిన కమిటీ పిలిపించుకుని మాట్లాడింది. ఉద్యోగ సంఘాల్లో చీలిక తీసుకురావాలన్నదే వారి ఉద్దేశం. సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నాం. ప్రతిరోజూ కనీసం వంద మంది పాల్గొంటారు’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు