Rajampeta: రాజంపేటలో పెల్లుబికిన నిరసనలు
రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ శుక్రవారం కూడా ఆందోళనలు మిన్నంటాయి. రైల్వేకోడూరులోనూ భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. రాజంపేటనే... అన్నమయ్య జిల్లా
విద్యార్థులు.. నేతల ర్యాలీ, ప్రదర్శనలు
రైల్వేకోడూరులోనూ సాగిన ఉద్యమం
ఈనాడు డిజిటల్, కడప: రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ శుక్రవారం కూడా ఆందోళనలు మిన్నంటాయి. రైల్వేకోడూరులోనూ భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. రాజంపేటనే... అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. రాజంపేటలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. రైల్వేకోడూరులో విద్యార్థులు, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు భగ్గుమన్నారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆంక్షలతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు నేతలు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. రాజంపేటనే జిల్లా కేంద్రంగా ఎంపిక చేయాలంటూ పురపాలక సంఘం ప్రత్యేక తీర్మానం చేసినట్లు ఛైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డి తెలిపారు. తీర్మానాన్ని ముఖ్యమంత్రికి పంపినట్లు చెప్పారు. తమ డిమాండును ఆమోదించకపోతే రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు నియోజకవర్గాలను కలుపుతూ ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని వైస్ఛైర్మన్ మర్రి రవి డిమాండు చేశారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోతే.. రైల్వేకోడూరును బాలాజీ జిల్లాలో కలపాలని వైకాపా విద్యార్థి నేత బండారు మల్లికార్జున అన్నారు.
ప్రజల మనోభావాలను గౌరవిస్తాం: శ్రీకాంత్రెడ్డి
ఈనాడు, అమరావతి: జిల్లా కేంద్రంగా రాజంపేట ప్రకటించాలన్న అక్కడి ప్రజల మనోభావాలను గౌరవిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. కడప జిల్లా విభజన విషయంలో స్థానికంగా వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘సరిహద్దులను నిర్ణయించడానికి 30 రోజుల గడువు ఉంది. కమిటీ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటాం. వివాదాలను ఎలా పరిష్కరించాలనే దానిపై ప్లానింగ్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాం’’ అని పేర్కొన్నారు.
మదనపల్లె జిల్లా సాధన ఉద్యమం ఉద్రిక్తం
మదనపల్లె (గ్రామీణ, నేరవిభాగం), న్యూస్టుడే: మదనపల్లె జిల్లా ఏర్పాటు కోసం చేపట్టిన ఉద్యమం ఉద్రిక్తమైంది. శుక్రవారం మదనపల్లె జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించారు. తెదేపా, కాంగ్రెస్, జనసేన, జిల్లా సాధన కమిటీ నాయకులు పలువురు ఎంపీ కార్యాలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు మాలమహానాడు, సీపీఐ నాయకులనూ అడ్డుకోవడంతో నిరసన చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. టమాటా మార్కెట్ ఎదుట రైతులు, హమాలీలు, ఆటో డ్రైవర్లతో కలిసి అర్ధనగ్న ప్రదర్శన, ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మదనపల్లెను జిల్లా కేంద్రం చేసేందుకు అన్ని అర్హతలున్నాయని తెదేపా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్, షాజహాన్బాషా, జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ గౌతంకుమార్ అన్నారు.
ఆదోని జిల్లా కోరుతూ రాస్తారోకో
ఆదోని, న్యూస్టుడే: ఆదోని జిల్లా డిమాండు ఊపందుకుంటోంది. కర్నూలు జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గ కేంద్రాల్లో శుక్రవారం తెదేపా, ప్రజాసంఘాల నేతలు తమ డిమాండును పునరుద్ఘాటించారు. పీడీఎస్యూ, డీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆదోని భీమాస్ కూడలిలో రాస్తారోకో చేపట్టారు. ఎమ్మిగనూరులో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
రంపచోడవరం జిల్లా కావాలని ఆందోళన
రంపచోడవరం, న్యూస్టుడే: పాడేరు కేంద్రంగా ఏర్పడే జిల్లాతో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని తూర్పుగోదావరి మన్యం వాసులు అంటున్నారు. పాడేరు జిల్లాను రద్దు చేసి, రంపచోడవరాన్ని జిల్లాగా ప్రకటించాలని మన్యంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం ఆందోళనలు చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఎంపీపీ శ్రీదేవి, జడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి, వైకాపా మండల కన్వీనర్ రామన్నదొర ఆధ్వర్యంలో సర్పంచి బొజ్జయ్య అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఎటపాక నుంచి పాడేరుకు 350 నుంచి 400 కి.మీ., రంపచోడవరం నుంచి 250 నుంచి 300 కి.మీ. దూరం ఉంటుందన్నారు. ర్యాలీగా వెళ్లి ఐటీడీఏ ఏపీవో నాయుడికి వినతిపత్రం అందజేశారు.
నరసాపురం బంద్ ప్రశాంతం
నరసాపురం, న్యూస్టుడే: కొత్తగా ఏర్పాటయ్యే పశ్చిమగోదావరి జిల్లాకు నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఐకాస ఆధ్వర్యంలో శుక్రవారం నరసాపురం పట్టణంలో బంద్ పాటించారు. ఈ సందర్భంగా వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసేశారు. ప్రభుత్వ కార్యాలయాలు తెరవలేదు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఐకాస నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు.
నేడు హిందూపురం బంద్
హిందూపురం, న్యూస్టుడే: హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండుతో అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం పట్టణ బంద్కు పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్