House Planning: దేనికీ ప్లాన్!
రాష్ట్రవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో.. వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా భవనాల ప్లాన్ల వివరాలు సేకరిస్తున్నారు. విషయమేంటో స్పష్టంగా చెప్పకుండా ఉన్నట్టుండి ప్లాన్ కాపీలు ఎందుకు అడుగుతున్నారో తెలియక భవన యజమానులు ఆందోళన చెందుతున్నారు.
నగరాలు, పట్టణాల్లో ఇళ్ల ప్రణాళికల వివరాల సేకరణ
విశాఖలో వాలంటీర్ల నుంచి సందేశాలు
ఈనాడు - అమరావతి
రాష్ట్రవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో.. వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా భవనాల ప్లాన్ల వివరాలు సేకరిస్తున్నారు. విషయమేంటో స్పష్టంగా చెప్పకుండా ఉన్నట్టుండి ప్లాన్ కాపీలు ఎందుకు అడుగుతున్నారో తెలియక భవన యజమానులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా అమల్లో ఉన్న అద్దె ఆధారిత పన్ను విధానాన్ని మార్చి, కొత్తగా మూలధన విలువ ఆధారిత పన్ను విధానం అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల పన్నులు భారీగా పెరుగుతాయని ప్రజలు ఇప్పటికే ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు ఇంటి ప్లాన్లు తీసుకుని ఇంకేం అదనపు భారాలు మోపుతారోనన్న భయం వారిలో వ్యక్తమవుతోంది. ఇంటి ప్లాన్ల వివరాలు సేకరించడంపై విశాఖపట్నంలో ఇప్పటికే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జనసేన నాయకులు కూడా కమిషనర్ను కలిసి నిరసన తెలియజేశారు.
ప్లాన్ అతిక్రమిస్తే జరిమానా
అద్దె ఆధారిత విధానం నుంచి ఆస్తి మూలధన విలువ ఆధారిత పన్ను విధానంలోకి మారినప్పుడు.. భవనాల కొలతలతో పాటు, ప్లాన్ వివరాల్నీ రికార్డుల్లో నమోదు చేయాలని, అందుకే ప్లాన్లు ఇవ్వాలని అడుగుతున్నట్లు కొందరు సిబ్బంది చెబుతున్నారు. ప్లాన్ అతిక్రమించిన నిర్మాణాలు చేపట్టినవారికి ఆస్తిపన్నులో కొంత మొత్తం జరిమానాగా విధించే విధానం ఎప్పటి నుంచో ఉంది. భారీ ఉల్లంఘనలు ఉంటే తప్ప ఇప్పటివరకు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల అధికారులు అతిక్రమణలను చూసీచూడనట్టు పోయేవారు. కొత్త విధానంలో భవనం కొలతలు, ప్లాన్ల వివరాలు కార్యాలయంలో అందుబాటులో ఉంటే అధికారులే ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ప్లాన్ అందుబాటులో లేకుంటే యజమానులను అడుగుతున్నారు. ఆన్లైన్లో నమోదు చేసినప్పుడు.. అతిక్రమణ ఉన్నట్టు తేలితే నిబంధనల మేరకు జరిమానా పడుతుంది. అనుమతి తీసుకోకుండానే భవనాలు నిర్మించినవారు, ప్లాన్ను అతిక్రమించినవారు బీపీఎస్లో క్రమబద్ధీకరణ చేసుకుని ఉండకపోతే, ఇప్పుడు జరిమానాలు కట్టాల్సి వస్తుంది. ఇంతకాలం ప్లాన్ అతిక్రమణలున్నా జరిమానా చెల్లించనివారు ఇప్పుడు కట్టాల్సి ఉంటుంది.
స్పందించని పురపాలకశాఖ అధికారులు
నగరాలు, పట్టణాల్లో భవనాల యజమానుల నుంచి ప్లాన్ల వివరాలు ఎందుకు సేకరిస్తున్నారన్న అంశంపై పురపాలకశాఖ అధికారుల అధికారుల వివరణ తీసుకోడానికి ‘ఈనాడు’ ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు. పురపాలకశాఖ కమిషనర్ ఎంఎం నాయక్కు ఫోన్లు చేసినా, సందేశం పంపినా ఆయన స్పందించలేదు.
మీ ఇంటికి ప్లాన్ ఉందా? ఉంటే దాని కాపీ వార్డు సచివాలయంలో ఇవ్వండి. కాపీ ఇవ్వకపోతే మీ భవనాన్ని అనధికార నిర్మాణంగా పరిగణిస్తాం.
-విశాఖపట్నంలోని నివాస, వాణిజ్య భవనాల యజమానుల ఫోన్లకు వార్డు వాలంటీర్ల నుంచి వచ్చిన సంక్షిప్త సందేశమిదీ
మీ ఇంటి ప్లాను కాపీ చూపించండి. మాకివ్వడం ఇష్టం లేకపోతే వార్డు సచివాలయంలో చూపించొచ్చు. ఇంటికి ప్లాన్ ఉందో లేదో నిర్ధారించుకోవడానికి,భవనాన్ని ఎప్పుడు నిర్మించారో తెలుసుకోవడానికే అడుగుతున్నాం.
-ఇది తూర్పుగోదావరి జిల్లా తునిలోని పలు వార్డుల్లో సచివాలయ ఉద్యోగులు చెబుతున్న మాట.
చట్టాలు ఏం చెబుతున్నాయి?
* 1994 మార్చి 1కి ముందు నిర్మించిన భవనాలకు ప్లాన్ లేకపోయినా, ప్లాన్ను అతిక్రమించినా జరిమానాలు లేవు.
* 1994 మార్చి 1 నుంచి 2007 డిసెంబరు 14 మధ్య నిర్మించిన భవనాలకు 10 శాతం, 2007 డిసెంబరు 15 నుంచి 2013 ఆగస్టు 4 మధ్య నిర్మించిన భవనాలకు నిబంధనలు మీరితే 25 శాతం జరిమానా విధిస్తారు.
* 2013 ఆగస్టు తర్వాత నిర్మించిన భవనాలకు.. ప్లాన్లో అతిక్రమణలు 10 శాతం వరకు ఉంటే 25 శాతం, 10 శాతం దాటితే 50 శాతం, ప్లాన్ లేకపోతే 100 శాతం జరిమానా విధిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు