Omicron: వస్తున్నాయ్.. పోతున్నాయ్!
కరోనాలో కొత్త ఉత్పరివర్తనాలు వైద్య రంగానికి సవాలు విసురుతూనే ఉన్నాయి. డెల్టా, డెల్టాప్లస్, ఏవై.12 ఉత్పర్తివర్తనాల (మ్యుటేషన్ల) గురించి మరచిపోక ముందే తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ తెరపైకి వచ్చింది. వివిధ దేశాల్లో కొత్త ఉత్పరివర్తనం వెలుగులోకి వచ్చిన కొద్దికాలానికి మన రాష్ట్రంలోనూ ఆనవాళ్లు కనిపించాయి
రాష్ట్రంలో 3,550 కరోనా ఉత్పరివర్తనాల కేసులు
వాటి బాధితులంతా సురక్షితమే
ఒమిక్రాన్ నేపథ్యంలో మళ్లీ చర్చ
ఈనాడు - అమరావతి
కరోనాలో కొత్త ఉత్పరివర్తనాలు వైద్య రంగానికి సవాలు విసురుతూనే ఉన్నాయి. డెల్టా, డెల్టాప్లస్, ఏవై.12 ఉత్పర్తివర్తనాల (మ్యుటేషన్ల) గురించి మరచిపోక ముందే తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ తెరపైకి వచ్చింది. వివిధ దేశాల్లో కొత్త ఉత్పరివర్తనం వెలుగులోకి వచ్చిన కొద్దికాలానికి మన రాష్ట్రంలోనూ ఆనవాళ్లు కనిపించాయి. అయితే... ఇప్పటివరకు బాధితులంతా సాధారణ జీవనాన్ని సాగిస్తున్నారని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. అసలు వారికి సోకిన కరోనాలో మ్యుటేషన్ ఉన్నట్లు బాధితులకు ఎవ్వరకీ తెలియదన్నారు.
రెండోదశ నుంచే నమూనాల పరీక్ష
కొవిడ్ రెండో దశ మొదలవడానికి ముందే ప్రతి ఆర్టీపీసీఆర్ ల్యాబ్ నుంచి 15 రోజులకోసారి 15 నమూనాలను సీసీఎంబీ, ఇతర చోట్లకు పంపుతున్నారు. వీటిని పరీక్షించి కరోనా ఉత్పరివర్తనాలను గుర్తిస్తున్నారు. కొత్త మ్యుటేషన్లు వచ్చినప్పుడల్లా తమవద్ద ఉన్న నమూనాలను మళ్లీ పరీక్షిస్తున్నారు. ఈక్రమంలో వివిధ రకాల ఉత్పరివర్తనాల కింద నమోదైన కేసులు 3,550 వరకు ఉన్నాయి. వీటిలో అల్ఫా (బి.1.1.7) కేసులు 1,097, డెల్టా (బి.1.617.2) కేసులు 2,052 వరకు ఉన్నాయి. అల్ఫా కేసులు అత్యధికంగా 324 చిత్తూరు జిల్లాలో, తక్కువగా 19 కేసులు కడప జిల్లాలో నమోదయ్యాయి.
డెల్టా కేసులైతే అత్యధికంగా కడప జిల్లాలో 424 వచ్చాయి. తక్కువగా 92 కేసులు కృష్ణా జిల్లాలో నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్లో తిరుపతిలో తొలి డెల్టాప్లస్ కేసు నమోదైంది. తాజాగా ఒమిక్రాన్ తీవ్రతపై స్పష్టత లేకున్నా... అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించే వారిపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. ముఖ్యంగా ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారి కదలికలను నియంత్రిస్తే దాని వ్యాప్తిని ప్రాథమిక దశలోనే అరికట్టవచ్చునని సీనియర్ వైద్యులు ఒకరు పేర్కొన్నారు. అదే సమయంలో అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించే నమూనాలను సైతం జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
హామీలకు శిలువ!
గత ఎన్నికలకు ముందు.. మ్యానిఫెస్టో అనే పదానికి తానే తొలిసారిగా అర్థం కనిపెట్టినట్లు చెప్పారు జగన్. దాన్ని బైబిల్తో పోల్చి ప్రచారం చేశారు. క్రైస్తవుల ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. తీరా చూస్తే.. ఈ ఐదేళ్ల పాలనలో అదే బైబిల్ను దైవసమానంగా చూసే క్రైస్తవులను జగన్ వంచించారు. -
అక్రమాల కిరణం!
అవినీతి, అరాచకం కలగలిసిన అక్రమాల ‘కిరణం’ ఆయన. కొండల్ని కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు.. ఇసుకలో దోచేశారు.. రియల్ ఎస్టేట్ దందాల్లో ఆరితేరారు.. ఒకప్పుడు రోజువారీ ఖర్చులకూ కటకటలాడిన ఆయన.. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్లకు పడగలెత్తారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
జలభగ్నం
‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. -
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
అయిదేళ్లు చాల్లేదా..జగన్?
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. వారి పిల్లల కోసం నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని మాత్రం పట్టించుకోలేదు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
అయినవాళ్లకే భద్రత
ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్