PM Modi: అమృత కాలం.. కర్తవ్యమే మంత్రం
వచ్చే 25 ఏళ్లు దేశానికి అమృత కాలమని, లక్ష్యాల సాధనకు ప్రతిఒక్కరూ ‘కర్తవ్య మంత్రం’ పఠించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుధవారం శిమ్లాలో హిమాచల్ప్రదేశ్ శాసనసభ వేదికగా ప్రారంభమైన 82వ అఖిల భారత సభాపతుల సదస్సును
గడిచిన 75 ఏళ్లకు మించి రాబోయే పాతికేళ్లలో అభివృద్ధి
భారతీయ సమాజ సహజ స్వరూపం ప్రజాస్వామ్యం
అఖిల భారత స్పీకర్ల సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన
స్పీకర్ల సదస్సులో వీడియో ద్వారా మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఈనాడు, దిల్లీ: వచ్చే 25 ఏళ్లు దేశానికి అమృత కాలమని, లక్ష్యాల సాధనకు ప్రతిఒక్కరూ ‘కర్తవ్య మంత్రం’ పఠించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుధవారం శిమ్లాలో హిమాచల్ప్రదేశ్ శాసనసభ వేదికగా ప్రారంభమైన 82వ అఖిల భారత సభాపతుల సదస్సును ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 2047 నాటికి దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలి, అందులో చట్టసభల పాత్ర ఎలా ఉండాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చించి దిశానిర్దేశం చేస్తే అదెంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సభాపతుల భేటీ పరంపర వందేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషకరమని అన్నారు. ‘ప్రజాస్వామ్యం ఒక వ్యవస్థ మాత్రమే కాదు. అది భారతీయ సహజ స్వభావ స్వరూపం. రాబోయే సంవత్సరాల్లో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి. అసాధారణ లక్ష్యాలను చేరుకోవాలి. అది అందరి ప్రయత్నంతోనే సాధ్యమవుతుంది. గత 75 ఏళ్లకు మించి రాబోయే 25 ఏళ్లలో దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేది కర్తవ్యమే అని గుర్తుంచుకోవాలి’ అని ప్రధాని చెప్పారు. ‘‘జీవితాన్ని పూర్తిగా సమాజ అభ్యున్నతి కోసం అంకితం చేసిన ప్రజా ప్రతినిధులు ప్రతి పార్టీలోనూ ఉంటారు. ఇలాంటి వారిని గుర్తించి వారి అనుభవాలను పంచుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం మేలు’’ అన్నారు.
చర్చలకు విలువ జోడించాలి
‘‘చట్టసభల్లో చర్చలకు విలువను ఎలా జోడించాలి అన్నది చూడాలి. అన్ని పార్టీలూ చర్చలకు ప్రాధాన్యం ఇచ్చి సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొల్పాలి. ఇందులో సభాపతుల పాత్ర చాలా కీలకం. యువ సభ్యులకు, వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చినవారికి, మహిళలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి. పార్లమెంటు కమిటీలనూ ప్రజావసరాలకు తగ్గట్టు నిర్వహించాలి.
దేశమంతటికీ ఒకే డిజిటల్ శాసన వేదిక!
దేశమంతటికీ ఒకే రేషన్ కార్డు, వేర్వేరు అవసరాలకు ఉమ్మడిగా వినియోగించుకునే రూపే కార్డు లాంటివి ప్రారంభించుకున్నాం. అలాగే ఇప్పుడు ‘ఒకే దేశం.. ఒకే శాసనవేదిక’ సాధ్యమా? అన్నది పరిశీలించాలి. శాసనవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, దేశంలోని అన్ని స్థానిక సంస్థలను కలిపేందుకు ఒక డిజిటల్ వ్యవస్థను రూపొందించాలి. చట్టసభలకు సంబంధించిన అన్ని వివరాలూ ఈ పోర్టల్లో లభించేలా చూడాలి. చట్టసభలు కాగిత రహితంగా పనిచేయాలి. పార్లమెంటు ఉభయ సభాపతుల ఆధ్వర్యంలో ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అన్ని శాసనసభల గ్రంథాలయాలనూ డిజిటల్ రూపంలో ఆన్లైన్లోకి అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాన్ని వేగంగా పూర్తిచేయాలి’’ అని మోదీ పేర్కొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ- చట్టసభల హుందాతనాన్ని పెంచడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ప్రజల హక్కుల్ని కాపాడేలా చట్టసభల నియమ నిబంధనల్ని సమీక్షించాలని సభాపతుల్ని కోరారు. చట్టసభలన్నింటికీ వర్తించేలా నిబంధనలపై ఒక నమూనా పత్రాన్ని సిద్ధం చేయాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు