PM Modi: మీరు మారకపోతే.. నేనే మార్చేస్తా
పార్లమెంటుకు క్రమం తప్పకుండా హాజరుకావాలని భాజపా ఎంపీలకు ప్రధాని మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఎంపీలు మారాలని, లేనిపక్షంలో తామే మార్పు తీసుకొస్తామని హెచ్చరించారు. చిన్నపిల్లలు...
పార్లమెంటుకు హాజరుపై భాజపా ఎంపీలకు ప్రధాని హెచ్చరిక
భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా
దిల్లీ: పార్లమెంటుకు క్రమం తప్పకుండా హాజరుకావాలని భాజపా ఎంపీలకు ప్రధాని మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఎంపీలు మారాలని, లేనిపక్షంలో తామే మార్పు తీసుకొస్తామని హెచ్చరించారు. చిన్నపిల్లలు కూడా పదేపదే చెప్పించుకోవడానికి ఇష్టపడరన్నారు. దిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో మంగళవారం ఏర్పాటుచేసిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విలేకరులకు వెల్లడించారు. పార్టీ ఎంపీలంతా తమ నియోజకవర్గాల్లో క్రీడా పోటీలు నిర్వహించాలని మోదీ సూచించినట్టు ఆయన తెలిపారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ... పార్టీ జిల్లా, మండల అధ్యక్షులతో తరచూ సమావేశం కావాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. వారితో కలిసి తేనీరు తాగాలన్నారు. ప్రధాని మోదీ కూడా తన నియోజకవర్గమైన వారణాసిలో ఈనెల 14న పార్టీ జిల్లా, మండల అధ్యక్షులతో భేటీ అవుతారని తెలిపారు. సంప్రదాయానికి భిన్నంగా భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం తొలిసారి పార్లమెంటు వెలుపల జరిగింది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో మరమ్మతులు జరుగుతుండటంతో సమావేశ వేదికను మార్చారు. హోంమంత్రి అమిత్ షా, ఇతర నేతలు, పార్టీ ఎంపీలు హాజరయ్యారు. సమావేశంలో నేతలు మోదీకి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. నవంబరు 15ను బిర్సా ముండా జయంతిగా నిర్వహించుకోవాలని మోదీ చేసిన ప్రకటనపై కేంద్రమంత్రి అర్జున్ ముండా హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రధానిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.
13న కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న కాశీ విశ్వనాథ్ కారిడార్ను ప్రారంభించనున్నట్టు భాజపా ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మంగళవారం తెలిపారు. ‘దివ్య కాశీ, భవ్య కాశీ’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి భాజపా సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమవుతుందని వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.‘‘పవిత్ర నగర రూపురేఖలను మార్చేందుకు సంకల్పించడం ద్వారా భారత సాంస్కృతిక హీరోగా మోదీ నిలిచారు. 250 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని ఆలయ పరిసరాల్లో సుందరీకరణ, పునర్నిర్మాణ పనులు జరిగాయి. ఈ సందర్భంగా వారణాసిలో నెల రోజులపాటు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నెల 13-14 తేదీల్లో భాజపా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో, 17న దేశంలోని అందరు మేయర్లతో సమావేశాలు ఉంటాయి’’ అని తరుణ్ చుగ్ పేర్కొన్నారు.
16న వారణాసిలో యూపీ మంత్రివర్గ సమావేశం
ఈనాడు, లఖ్నవూ: కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం నేపథ్యంలో వారణాసిలో ఈ నెల 16న ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా కాశీ గొప్పతనాన్ని, హిందూత్వ సందేశాన్ని చాటిచెప్పేందుకు భాజపా సర్కారు ప్రయత్నిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రధాని కలల ప్రాజెక్టు...
2014 ఎన్నికల్లో వారణాసి నుంచి గెలిచిన తరువాత ప్రధాని మోదీ తన పార్లమెంటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ను ఆయన కలల ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. వారణాసిలో మోదీ పలుమార్లు పర్యటించిన సందర్భంగా ఆలయంలో పూజలు చేయడమే కాకుండా, కారిడార్ నిర్మాణం విషయమై ప్రత్యేకంగా అధికారులతో మాట్లాడేవారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM