PRC:పీఆర్సీ ఉత్తర్వులు రద్దు చేస్తేనే చర్చలు
పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయం ఆలోచిస్తామని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ తేల్చిచెప్పింది. ప్రభుత్వంతో చర్చలకు రావాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ చేసిన
సంప్రదింపులకు ఆహ్వానించిన ప్రభుత్వం
నిర్ద్వంద్వంగా తిరస్కరించిన ఉద్యోగ సంఘాలు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నేడు సమ్మె నోటీసు
జిల్లాలతో ఉద్యమ కార్యాచరణకు పర్యవేక్షణ సెల్ ఏర్పాటు
పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం
ఈనాడు - అమరావతి
పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయం ఆలోచిస్తామని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ తేల్చిచెప్పింది. ప్రభుత్వంతో చర్చలకు రావాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ చేసిన ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అశుతోష్ మిశ్ర నివేదికను ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. అంతకుముందు.. ఉద్యోగ సంఘాల నాయకులను సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాల్సిందిగా మంత్రుల కమిటీ ఆహ్వానించింది. సంప్రదింపుల కోసం మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మలతో ఓ కమిటీని ఏర్పాటుచేశారు.
విజయవాడలోని రెవెన్యూ కార్యాలయంలో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ ఆదివారం దాదాపు 5 గంటలకు పైగా సమావేశమై చర్చించింది. ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వం, వైకాపా చేస్తున్న ప్రచారాన్ని ఖండించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి విధానాన్ని చూడలేదంది. జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలని, కొత్త జీతాలు ఇచ్చేందుకు ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి తేవొద్దని సూచించింది. జిల్లాలతో ఉద్యమ కార్యాచరణ సమన్వయం, సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలపై సమాధానాలు ఇచ్చేందుకు 8 మంది సభ్యులతో పర్యవేక్షణ సెల్ను ఏర్పాటు చేసింది. స్టీరింగ్ కమిటీలో సభ్యులను 20కి పెంచారు. సమ్మెకు అన్ని సంఘాలూ మద్దతు ప్రకటించాయి.
ఇంత పెద్ద ఉద్యమం చరిత్రలోనే లేదు: బండి శ్రీనివాసరావు
ఇంత పెద్ద ఉద్యోగుల ఉద్యమం చరిత్రలో ఎప్పుడూ లేదని ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. ‘స్టీరింగ్ కమిటీలో అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. సీఎస్కు సోమవారం మధ్యాహ్నం 3గంటలకు సమ్మె నోటీసు ఇస్తాం. ఈ ఉద్యమానికి కారణం ప్రభుత్వమే. పీఆర్సీ అంటే జీతాలు పెరగడమే చూశాం. కానీ, ఇప్పుడు జీతాల రికవరీ చూస్తున్నాం. పాత జీతాలే ఇవ్వాలని సీఎస్కు విన్నవించాం. ప్రభుత్వం మాత్రం కొత్త జీతాలు ఇవ్వాలని ట్రెజరీ అధికారులపై ఒత్తిడి తెస్తోంది. స్టీరింగ్ కమిటీ సభ్యుల సంఖ్యను 12 నుంచి 20 మందికి పెంచాం. జిల్లాలతో సమన్వయం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తాం’ అని తెలిపారు.
ఉద్యోగులను రెచ్చగొట్టడం మంచిది కాదు: బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఉద్యోగులను రెచ్చగొట్టడం మంచిది కాదని ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హితవు పలికారు. ‘ఎప్పుడూ చరిత్రలో చూడని విధంగా సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ప్రభుత్వం, వైకాపా ఉద్యోగులపై మాటల యుద్ధం చేయిస్తున్నాయి. ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నవి అబద్ధాలని, వారిపై మాటల యుద్ధం చేయాలని చెప్పడంపై ఆవేదన చెందుతున్నాం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల వాతావరణం కల్పించాలే గానీ, ఘర్షణ వాతావరణం సృష్టించకూడదు. ఉద్యమ సమయంలో ఆవేదన, ఆవేశంతో మాట్లాడిన వాటిపైనా కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఉద్యోగులకు వ్యతిరేకంగా కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రభుత్వం, ఉద్యోగులు వేర్వేరు కాదు. చర్చలకు రమ్మంటారు.. వారు చెప్పినదానిపైనే ఉంటారు. మేము ఏ పార్టీనీ ఉద్యమంలోకి రానివ్వడం లేదు. గత రెండు, మూడు రోజులుగా జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే ఉద్యోగులు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారని ప్రభుత్వం భావిస్తున్నట్లు అనిపిస్తోంది. పీఆర్సీ నివేదికపై చర్చించకుండానే నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం పట్ల నిరసన తెలుపుతున్నాం. ఉద్యోగులందరూ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. ఎవరూ రాజకీయ, వ్యక్తిగత దూషణలు చేయొద్దు. ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవడం లేదు. మెరుగైన పీఆర్సీ, సీఎం హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నాం. పీఆర్సీపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలి’ అని సూచించారు.
ఉత్తర్వులు రద్దుచేసే వరకూ చర్చలు ఉండవు: సూర్యనారాయణ
పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడం, అశుతోష్ మిశ్ర కమిటీ నివేదికను ఇస్తేనే ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని నిర్ణయించామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు. ‘ఉద్యమ కార్యాచరణపై సమావేశమయ్యాం. ప్రభుత్వంతో చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైనా చర్చించాం. మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారన్నది మీడియాలో చూశాం. ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపేందుకు అధికారంగా కమిటీ ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ ఫోన్ చేసి, సోమవారం చర్చలకు రావాలని పిలిచారు. కమిటీ పరిధి ఏంటో తెలియడం లేదు. కొత్త పీఆర్సీని బలవంతంగా అమలుచేయడం నిలిపివేయాలి. జనవరికి పాత వేతనాలే ఇవ్వాలి. ఉద్యోగులు ఎవరికి వారు ఉద్యమ కార్యాచరణపై ఉండాలి. రాజకీయ వివాదాలకు తావు ఇవ్వకుండా ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించి చెప్పాలి’ అని సూచించారు.
పీఆర్సీ ఉత్తర్వులతో తీవ్ర నష్టం: వెంకట్రామిరెడ్డి
ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ ఉత్తర్వుల వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ‘పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే సమయంలో అన్నీ సమన్వయం చేసుకోకపోవడంతోనే నష్టం జరిగిందని భావించాం. అందుకే కలిసి పోరాడాలని నిర్ణయించాం. ప్రభుత్వం పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. అశుతోష్ మిశ్ర నివేదిక ఇవ్వాలి. ఆ నివేదికపై చర్చలు పునఃప్రారంభించాలి. మెరుగైన పీఆర్సీ ఇవ్వాలి. ఉద్యోగసంఘాల్లో వచ్చిన ఐక్యత చూసి, ఇతర సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. ఉద్యోగులకు నమ్మకం కలగడంతో ప్రతిపాదనలు ఇస్తున్నారు. పీఆర్సీ, సీఎం ప్రకటించిన అంశాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిపైనా చర్చిస్తాం. ఉద్యమ ఫలితాలు ఉద్యోగులకు దక్కేలా చూస్తాం. సచివాలయ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహిస్తున్నాం. ఉద్యోగుల అభిప్రాయం తీసుకుంటాం’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజును వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
గుత్తేదార్ల దయ.. గనులశాఖ ప్రాప్తం
టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు. -
‘పర్యాటకం...’ పక్కా నాటకం!
జగన్ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం