Sankranthi:పోరు‘బరి’లో దూసిన కత్తులు
ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా, ఇతర ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. ఆదివారం కనుమ రోజు పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా వందలాది బరులు ఏర్పడ్డాయి. సంక్రాంతి 3రోజుల్లో వందల కోట్లు చేతులు మారాయి. గుండాటలు పెద్దఎత్తున జరిగాయి.
జోరుగా కోడి పందేలు
చేతులు మారిన రూ.కోట్లు
కార్లు, బైక్లు కూడా పందేనికి..
జాతరను తలపించిన మైదానాలు
ముమ్మిడివరం, ఏలూరు గ్రామీణ, భీమవరం పట్టణం, పాలకోడేరు, న్యూస్టుడే: ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా, ఇతర ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. ఆదివారం కనుమ రోజు పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా వందలాది బరులు ఏర్పడ్డాయి. సంక్రాంతి 3రోజుల్లో వందల కోట్లు చేతులు మారాయి. గుండాటలు పెద్దఎత్తున జరిగాయి. అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషించింది. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దదైన కాట్రేనికోన మండలం పల్లంకుర్రు బరి వద్ద శనివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఉభయగోదావరి జిల్లాల మధ్య రోజుకు 20 చొప్పున 3రోజులపాటు ఒప్పంద పందేలు నిర్వహించేందుకు అవగాహనకు వచ్చారు. వాటిలో ఎక్కువ గెలిచిన వారికి ఇన్నోవా కారు బహుమతిగా ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చిన వారికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేతృత్వం వహించారు. బరిలోకి ప్రవేశించే సభ్యుల సంఖ్య విషయంలో ఆయనకు, తూర్పుగోదావరి జిల్లా తరఫున పుంజులను బరిలోకి దింపుతున్న వారికి మధ్య స్వల్పవివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రభాకర్ బరి నుంచి బయటకు వెళ్లడంతో ఒప్పంద పందేలకు బ్రేక్ పడింది. దీంతో బహుమతిగా ప్రకటించిన ఇన్నోవా కారు ఎవరికీ దక్కలేదు. అనంతరం సాధారణ పందేలు యథావిధిగా సాగాయి. యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో కోడిపందేల కోసం స్థలం దొరకక తొలుత గ్రామ శ్మశానంలో బరి ఏర్పాటుచేశారు. ఆదివారం గ్రామానికి చెందిన ఒకరు చనిపోవడంతో మరోచోటకు బరి మార్చారు.
పందెంగా బుల్లెట్
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, ఉండి, కాళ్ల, వీరవాసరం, ఉండ్రాజవరం తదితర మండలాల్లో పండుగ 3రోజులు రాత్రివేళ ఫ్లడ్లైట్ల వెలుగులోనూ పందేలు నిర్వహించారు. ఒక్క ఏలూరు మండలంలో 3రోజుల్లో రూ.కోటిన్నరపైగా చేతులు మారినట్లు అంచనా. బరుల ప్రాంతాలు జాతరను తలపించాయి. పాలకోడేరు మండలం పెన్నాడలో పందేల్లో శృంగవృక్షం గ్రామానికి చెందిన రైతు బుల్లెట్ బైక్ గెలుచుకున్నారు. కొందరు స్నేహితులు కలిసి సొమ్ము వేసుకొని కొత్త బుల్లెట్ వాహనాన్ని కొన్నారు. రెండు బృందాలుగా ఏర్పడి పోటీ పడగా మిత్రబృందంలో ఒకరికి బుల్లెట్ దక్కింది. కృష్ణా జిల్లాలో కోడి పందేలు, జూదం విచ్చలవిడిగా జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు బరుల వద్ద నోటీసులంటించి ఉదాసీనంగా వ్యవహరించారు.
వరాహ సమరం
తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్టుడే: ఎక్కడైనా కోళ్లు, ఎడ్ల పందేలు చూస్తుంటాం. పందుల పోటీలు చూడాలంటే మాత్రం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెళ్లాల్సిందే. సంక్రాంతిని పురస్కరించుకుని గూడెం మండలం కుంచనపల్లిలో ఏటా పందుల పోటీలు నిర్వహిస్తారు. ఈసారి కూడా మెట్ట ఉప్పరగూడెం, కోనాల గ్రామాలకు చెందిన పందులు తలపడగా మెట్ట ఉప్పరగూడేనికి చెందిన వరాహం గెలిచింది. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాలవారు భారీగా హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
LS polls: డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై.. 71 వేల మంది డిపాజిట్లు ‘గల్లంతు’
-
Hyderabad: ప్రణీత్రావుకు సహకరించింది ఎవరు?
-
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్లో ఎవరున్నారంటే?
-
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
-
PM Modi: సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు