TTD: తప్పిన పెనుముప్పు
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమ దారిలో బుధవారం ఉదయం బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది. కొండపైకి వెళ్లే మార్గంలో 13, 14, 15 కిలోమీటర్ల పరిధిలో భారీగా దుమ్ము, పొగ లేవడాన్ని గుర్తించిన డ్రైవర్ రవీంద్ర.. వెంటనే బస్సు ఆపి మెల్లిగా వెనక్కి నడిపించారు.
తిరుమల రహదారిలో కొండచరియలు విరిగిపడి.. రోడ్లు, రక్షణ గోడ ధ్వంసం
తిరుమల రెండో కనుమ మార్గంలో ధ్వంసమైన రోడ్డు, ఆగిన వాహనాలు
తిరుమల, న్యూస్టుడే: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమ దారిలో బుధవారం ఉదయం బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది. కొండపైకి వెళ్లే మార్గంలో 13, 14, 15 కిలోమీటర్ల పరిధిలో భారీగా దుమ్ము, పొగ లేవడాన్ని గుర్తించిన డ్రైవర్ రవీంద్ర.. వెంటనే బస్సు ఆపి మెల్లిగా వెనక్కి నడిపించారు. అంతలోనే కొండచరియలు విరిగిపడుతూ బండరాళ్లు, మట్టి రోడ్డుపైకి జారాయి. బస్సు ముందుకువెళ్లి ఉంటే.. భారీ ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు, ప్రయాణికులు ఆందోళన చెందారు. రోడ్డు ధ్వంసం కావడంతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. తితిదే భద్రత, అటవీ శాఖల సిబ్బంది వచ్చి ట్రాఫిక్ను మళ్లించారు.
ఘాట్ రోడ్డులోని రక్షణ గోడను పరిశీలిస్తున్న తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి, చిత్రంలో జేఈవో వీరబ్రహ్మం, అధికారులు
తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులతో కలిసి ప్రమాదస్థలిని పరిశీలించారు. ఇటీవలి వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయని, రెండో ఘాట్రోడ్డులో మరో ఐదారు చోట్ల ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ‘వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించాం. గురువారం దిల్లీ ఐఐటీ నిపుణుల బృందం వస్తుంది. కొండచరియలు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. ఇక్కడ మరమ్మతులు పూర్తయ్యేదాకా మొదటి ఘాట్ రోడ్డులోనే వాహనాల రాకపోకలకు అనుమతిస్తాం. నడకదారిలో వెళ్లే భక్తులకు ఇబ్బంది లేదు’ అని వివరించారు. జారిపడిన బండరాళ్లను తొలగించామని ఈవో జవహర్రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!