Pattabhi: విమానంలో పట్టాభి.. ఫొటోలు వైరల్‌!

తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమానంలో ప్రయాణిస్తున్న, విమానాశ్రయంలో నుంచి వెళ్తున్న చిత్రాలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

Updated : 26 Oct 2021 09:56 IST

 

ఈనాడు, అమరావతి: తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమానంలో ప్రయాణిస్తున్న, విమానాశ్రయంలో నుంచి వెళ్తున్న చిత్రాలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అయితే ఆ చిత్రాలు ఏ విమానాశ్రయంలో తీశారనే దానిపై స్పష్టత లేదు. ముఖ్యమంత్రిని దూషించారన్న ఆరోపణలపై అరెస్టై.. బెయిల్‌పై శనివారం విడుదలైన ఆయన అదే రోజు రాత్రి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా ఆయన మాల్దీవులు పర్యటనకు వెళ్లారన్న ప్రచారం నడుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని