వచ్చే ఎన్నికల్లోనూ నరసన్నపేట అభ్యర్థిని నేనే
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా మళ్లీ తానే పోటీ చేస్తానని, 20వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని ఉప ముఖ్యమంత్రి
ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్
సారవకోట, న్యూస్టుడే: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా మళ్లీ తానే పోటీ చేస్తానని, 20వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండల పరిషత్తు సమావేశ భవనంలో ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మనసున్న, చిత్తశుద్ధి గల నాయకుడు జగన్మోహన్రెడ్డి అని, ఆయన నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లోనూ పోటీచేసి గెలుస్తానని తెలిపారు. గౌరవం కోసమే రాజకీయ పదవులని, ఉన్నత లక్ష్యంతో అందరూ పనిచేయాలని పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎన్నికల్లో వరుస వైఫల్యాలతో చంద్రబాబునాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రజల పక్షాన పోరాడితే గౌరవం పెరుగుతుంది తప్ప, అనవసర రాద్ధాంతాలు చేస్తే ఏ ప్రయోజనమూ ఉండదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!