లేఅవుట్లలో 5% స్థలం కేటాయింపునిర్ణయం పెద్ద కుంభకోణం
లేఅవుట్లలో 5 శాతం స్థలాన్ని స్థిరాస్తి వ్యాపారులు ప్రభుత్వానికి కేటాయించాలన్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి వర్గాలపై ఏటా రూ. కోట్లలో భారం పడుతుందని తెదేపా జాతీయ
తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం
ఈనాడు, అమరావతి: లేఅవుట్లలో 5 శాతం స్థలాన్ని స్థిరాస్తి వ్యాపారులు ప్రభుత్వానికి కేటాయించాలన్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి వర్గాలపై ఏటా రూ. కోట్లలో భారం పడుతుందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం పేర్కొన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వ్యాపారులు తమ జేబుల్లో నుంచి ఈ మొత్తం ఇచ్చే అవకాశం లేనందున కొనుగోలుదారులైన పేద, మధ్య తరగతిపైనే ఈ భారం పడుతుంది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను ఒక వైపున అమ్మకానికి పెట్టి...మరోవైపున నోటిఫికేషన్లు ఇస్తూ ఇంకా భూమి కావాలనడం దేనికి? ఇదివరకు తీసుకున్న 68 వేల ఎకరాలనే పేదలకు ఇంకాసరిగా పంచలేదు...’ అని ఆయన పేర్కొన్నారు. పేదలకోసం ప్రభుత్వ భూమి ఇస్తే తెదేపా కూడా స్వాగతిస్తుందని, జగన్ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకం వెనుక కుంభకోణం ఉంటోందని ఆరోపించారు. సీఎంకు అత్యంత ఆప్తులైన అరబిందో, రాంకీ, ఇందూ వంటి సంస్థలు హైదరాబాద్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయని.. వారికి మేలు చేసేందుకు ఏపీలోని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని పట్టాభిరాం ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్