టికెట్ల ధరలపై సీఎం చర్చలు జరపాలి: సీపీఐ

సినిమా టికెట్ల ధరల విషయమై ఆయా అసోసియేషన్లతో సీఎం జగన్‌ చర్చలు జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. నిత్యావసర సరకులు, ఇతరత్రా

Published : 15 Jan 2022 04:06 IST

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: సినిమా టికెట్ల ధరల విషయమై ఆయా అసోసియేషన్లతో సీఎం జగన్‌ చర్చలు జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. నిత్యావసర సరకులు, ఇతరత్రా ప్రజా వినియోగ వస్తువుల ధరల తగ్గింపుపై కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి శుక్రవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పెట్రోల్‌, డీజీల్‌ ధరల తగ్గింపుపై ఏపీ ప్రభుత్వం కుంటి సాకులతో ప్రకటనలు ఇచ్చిందని, బియ్యం, పప్పులు, నూనెలు వంటి నిత్యావసరాల ధరలను పట్టించుకోవట్లేదని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని