భోగి మంటల్లో జీవో ప్రతులు

ప్రభుత్వం ప్రజా వ్యతిరేక జీవోలను జారీ చేస్తోందని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఆస్తి పన్ను, చెత్తపై పన్ను,

Published : 15 Jan 2022 04:11 IST

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రజా వ్యతిరేక జీవోలను జారీ చేస్తోందని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఆస్తి పన్ను, చెత్తపై పన్ను, ఓటీఎస్‌కు సంబంధించిన జీవోలన్నీ ప్రజలకు ఇబ్బందిగా మారినవేనని పేర్కొన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌, తెదేపా కౌన్సిలర్లు పద్మావతి, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని