పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా: మనోహర్‌

‘కరోనా మూడో వేవ్‌ ఆందోళనకరంగా ఉంది. విద్యాసంస్థలను ఈ నెలాఖరు వరకు మూసివేస్తేనే విద్యార్థులను వైరస్‌ బారినుంచి కాపాడుకోగలం. కేసులు పెరిగితే చూద్దామని విద్యాశాఖ

Published : 18 Jan 2022 04:51 IST

ఈనాడు-అమరావతి: ‘కరోనా మూడో వేవ్‌ ఆందోళనకరంగా ఉంది. విద్యాసంస్థలను ఈ నెలాఖరు వరకు మూసివేస్తేనే విద్యార్థులను వైరస్‌ బారినుంచి కాపాడుకోగలం. కేసులు పెరిగితే చూద్దామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం బాధ్యత లేదని అర్థమవుతోంది’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలను మూసేసి ఆన్‌లైన్‌ విధానంలో తరగతుల నిర్వహణకు మార్గదర్శకాలనిచ్చాయి. వైద్య విద్యార్థులకే కరోనా సోకుతుంటే పాఠశాలల పిల్లల పరిస్థితేమిటి? అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు