ఉద్యోగులు సమ్మె చేయకముందే జీవోలు ఉపసంహరించాలి
ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వానికి ఉద్యోగులు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.
ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్
ఈనాడు, అమరావతి: ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వానికి ఉద్యోగులు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారులు సీఎంకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని శైలజానాథ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం 30% హెచ్ఆర్ఏ తీసుకుంటున్నారని... కొత్త విధానంలో 16 శాతమే వర్తిస్తుందని అన్నారు. ఫిట్మెంట్లో కోత విధించి డీఏ బకాయిల్లో సర్దుబాటు చేయడమేంటని మండిపడ్డారు. ఉద్యోగుల సమ్మెబాట పట్టకముందే జీవోలను ప్రభుత్వం ఉపసంహరించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?