పార్టీ కార్యకర్తలా.. రౌడీలా?

వైకాపా నాయకులు రౌడీల్లా ప్రవర్తించారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్‌లో క్యాసినోలో

Published : 22 Jan 2022 05:09 IST

తెదేపా నేత బొండా ఉమా మండిపాటు

వైకాపా నేతల వీడియోల విడుదల

ఈనాడు, అమరావతి: వైకాపా నాయకులు రౌడీల్లా ప్రవర్తించారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్‌లో క్యాసినోలో చిందులు వేసిన నాయకులే తమపై హత్యాయత్నం చేశారని, తన కారును ధ్వంసం చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోలను, ఫొటోలను మీడియాకు ఆయన విడుదల చేశారు. వైకాపా మండల పార్టీ అధ్యక్షుడు జాన్‌ విక్టర్‌ రాళ్లతో దాడి చేశారని, తన కారుపై రాయితో దాడి చేస్తున్న చిత్రం ఉందని ఉమా వెల్లడించారు. ఇదే వ్యక్తి మంత్రి కొడాలి నానితో సన్నిహితంగా ఉన్న చిత్రాలను విడుదల చేశారు. సంక్రాంతి సంబరాల్లో కె-కన్వెన్షన్‌లో డాన్సులు చేస్తున్న వీడియోను చూపించారు. మంత్రికి ముఖ్య సన్నిహితుడుగా ఉన్న మరో నాయకుడు శశిభూషణ్‌ కూడా రాళ్లు రువ్వారని ఆరోపించారు. ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తుంటే.. తెదేపా రెచ్చగొట్టినట్లు జిల్లా ఎస్పీ, డీఐజీ ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. వీడియోలు, సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తే.. గుడివాడ ఘటనల నిజస్వరూపం, పోలీసులు అధికారపార్టీకి సహకరించిన వైనం వెలుగుచూస్తాయని ఆయన మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు