SP: ఎస్పీలోకి పొడవైన వ్యక్తి ధర్మేంద్ర.. అఖిలేశ్ సమక్షంలో చేరిక
దేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా పేరొందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఈ మేరకు ఆయన లఖ్నవూలో అఖిలేశ్ యాదవ్ సమక్షంలో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరారు. యూపీలోని ప్రతాప్గఢ్కు చెందిన ధర్మేంద్ర
లఖ్నవూ: దేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా పేరొందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఈ మేరకు ఆయన లఖ్నవూలో అఖిలేశ్ యాదవ్ సమక్షంలో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరారు. యూపీలోని ప్రతాప్గఢ్కు చెందిన ధర్మేంద్ర ప్రతాప్ ఎత్తు 8.1 అడుగులు ఉండడం విశేషం. ఎస్పీలో చేరిన అనంతరం ధర్మేంద్ర మాట్లాడుతూ.. ‘‘పార్టీ ఏ బాధ్యత అప్పగించినా.. నిర్వహిస్తాను. పార్టీని మరింత ఎత్తుకు తీసుకెళ్లడంతో పాటు ప్రత్యర్థుల స్థాయిని మరుగుజ్జు చేయడానికి కృషి చేస్తాను. అఖిలేశ్ బరిలో నిలిచే కర్హాల్లో సైతం ప్రచారం చేస్తాను’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM