SP: ఎస్పీలోకి పొడవైన వ్యక్తి ధర్మేంద్ర.. అఖిలేశ్‌ సమక్షంలో చేరిక

దేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా పేరొందిన ధర్మేంద్ర ప్రతాప్‌ సింగ్‌ రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఈ మేరకు ఆయన లఖ్‌నవూలో అఖిలేశ్‌ యాదవ్‌ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరారు. యూపీలోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర

Updated : 24 Jan 2022 08:44 IST

లఖ్‌నవూ: దేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా పేరొందిన ధర్మేంద్ర ప్రతాప్‌ సింగ్‌ రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఈ మేరకు ఆయన లఖ్‌నవూలో అఖిలేశ్‌ యాదవ్‌ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరారు. యూపీలోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర ప్రతాప్‌ ఎత్తు 8.1 అడుగులు ఉండడం విశేషం. ఎస్పీలో చేరిన అనంతరం ధర్మేంద్ర మాట్లాడుతూ.. ‘‘పార్టీ ఏ బాధ్యత అప్పగించినా.. నిర్వహిస్తాను. పార్టీని మరింత ఎత్తుకు తీసుకెళ్లడంతో పాటు ప్రత్యర్థుల స్థాయిని మరుగుజ్జు చేయడానికి కృషి చేస్తాను. అఖిలేశ్‌ బరిలో నిలిచే కర్హాల్‌లో  సైతం ప్రచారం చేస్తాను’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని