హోదా కోసం ప్రాణాలిస్తామన్న జగన్.. ఇప్పుడు మాట్లాడరేం?: అచ్చెన్నాయుడు
ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పిస్తామని ఎన్నికల ముందు మాట్లాడిన జగన్మోహన్రెడ్డి.. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు.. అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ‘విభజన సమస్యల పరిష్కారానికి నియమించిన కమిటీ ఎజెండాలో తొలుత
ఈనాడు, అమరావతి: ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పిస్తామని ఎన్నికల ముందు మాట్లాడిన జగన్మోహన్రెడ్డి.. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు.. అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ‘విభజన సమస్యల పరిష్కారానికి నియమించిన కమిటీ ఎజెండాలో తొలుత ప్రత్యేక హోదాను చేర్చి తర్వాత తొలగించారు. ఇది వైకాపా లోపాయికారీతనం, చేతకానితనం కాదా? తన కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు’ అని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ‘ప్రత్యేక హోదాపై ఆస్కార్ అవార్డుకు మించి నటించిన జగన్రెడ్డికి ‘మోసకార్’ అవార్డు ఇవ్వాల్సిందే. ప్రత్యేక హోదాపై యువభేరి సదస్సులు నిర్వహించి యువతను మోసం చేసిన జగన్.. ఇప్పుడు క్షమాపణ సదస్సులు పెట్టాలి’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?