Chandrababu: చంద్రబాబుతో భేటీకి... గంటా తదితరులకు పిలుపు

విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు 12 మందితో తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో

Updated : 18 Feb 2022 07:08 IST

త్వరలో వచ్చి కలుస్తానన్న మాజీమంత్రి

ఈనాడు, అమరావతి: విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు 12 మందితో తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమవుతున్నారు. మాజీ మంత్రి, విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా ఆ జిల్లా నుంచి విశాఖ లోక్‌సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఇన్‌ఛార్జి పల్లా శ్రీనివాస్‌, తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబులను పిలిచారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున గంటా ఈ సమావేశానికి హాజరు కావడం లేదని సమాచారం. త్వరలో వచ్చి చంద్రబాబును కలుస్తానని పార్టీ కార్యాలయానికి ఆయన సమాచారమిచ్చినట్లు తెలిసింది. విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి ఇన్‌ఛార్జి బేబినాయన, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఇన్‌ఛార్జి పెందుర్తి వెంకటేష్‌ తదితరుల్ని చంద్రబాబుతో సమావేశానికి రావాలని పార్టీ కార్యాలయం నుంచి వర్తమానం వెళ్లింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని