జనసేన సభ్యత్వ నమోదును విజయవంతం చేయండి
‘జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదును ఈ నెల 21 నుంచి ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొని విజయవంతం చేయాలి’ అని పార్టీ
పవన్కల్యాణ్ పిలుపు
ఈనాడు, అమరావతి: ‘జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదును ఈ నెల 21 నుంచి ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొని విజయవంతం చేయాలి’ అని పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. 2020 సెప్టెంబరులో జనసేన క్రియాశీల సభ్యత్వం ప్రారంభిస్తే లక్ష మందికిపైగా సభ్యులయ్యారు. క్షేత్రస్థాయిలో అభిమానంతో పనిచేసే కార్యకర్తలు ప్రమాదవశాత్తూ మరణిస్తున్న విషయం గమనించానని, పార్టీ నాయకులు కొందరు వారి కుటుంబాలకు సాయం చేస్తున్న విషయాన్నీ గుర్తించానని వివరించారు. పార్టీ నాయకులతో చర్చించి జనసేన తరఫున ఒక బీమా పథకం తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రమాదాల్లో మరణించిన 23 మంది జనసైనికుల కుటుంబాలకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెక్కులు అందించినట్లు పవన్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్