వర్ల రామయ్య కుమారుడిపై కేసు
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కుమారుడు, పామర్రు నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి వర్ల కుమారరాజాపై విజయవాడ భవానీపురం పోలీసుస్టేషన్లో
భవానీపురం(విజయవాడ), న్యూస్టుడే: తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కుమారుడు, పామర్రు నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి వర్ల కుమారరాజాపై విజయవాడ భవానీపురం పోలీసుస్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. విద్యాధరపురం 44వ డివిజన్ చిన్నసాయిబాబా గుడి ఆర్చి వద్ద తాగునీటి పైపులైన్ల నిర్మాణం చేపట్టే నిమిత్తం శిలాఫలకం నిర్మించేందుకు ఎ.శేఖర్ అనే వ్యక్తికి పని అప్పగించారు. ఈనెల 19న కూలీలతో శేఖర్ శిలాఫలకం నిర్మాణ పని చేయిస్తున్నాడు. అక్కడికి వచ్చిన కుమారరాజా శిలాఫలకం కట్టవద్దంటూ నిర్మాణాన్ని అడ్డగించి చంపుతానంటూ బెదిరించినట్లు శేఖర్ విజయవాడ నగరపాలక సంస్థ తాగునీటి సరఫరా అసిస్టెంట్ ఇంజినీరు అహ్మద్కు తెలిపారు. దీంతో ఏఈ అహ్మద్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్