జనసేన వ్యవస్థాపక దినోత్సవ సభ వేదిక ఖరారు
జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సభ వేదిక ఖరారైంది. గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతం మంగళగిరిలో సభ నిర్వహణకు పార్టీ రాష్ట్ర నాయకత్వం శుక్రవారం ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 14న ఆవిర్భావ దినోత్సవ సభ ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
మంగళగిరి, న్యూస్టుడే: జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సభ వేదిక ఖరారైంది. గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతం మంగళగిరిలో సభ నిర్వహణకు పార్టీ రాష్ట్ర నాయకత్వం శుక్రవారం ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 14న ఆవిర్భావ దినోత్సవ సభ ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. మంగళగిరి వద్ద విజయవాడ-చెన్నై 16వ నంబరు జాతీయ రహదారి నుంచి 3 కి.మీ. దూరంలో ఇప్పటం గ్రామ పరిధిలో సభా స్థలిని ఎంపిక చేశారు. సుమారు 13 ఎకరాల భూమిని జేసీబీలతో చదును చేయిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మంగళగిరి ప్రాంతంలోనే మూడు, నాలుగు స్థలాలు పరిశీలించినా అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. చివరికి ఇప్పటం గ్రామ పరిధిలో గుంటూరు ఛానల్, విజయవాడ-చెన్నై ప్రధాన రైలు మార్గానికి మధ్యనున్న స్థలాన్ని ఎంపిక చేశారు. పార్టీ చేనేత విభాగం రాష్ట్ర ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు సభా స్థలి వద్ద పనులను పర్యవేక్షిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!