ఆ మాటలు మా గుండెల్ని తాకాయి.. సీఎం జగన్కు రుణపడి ఉంటాం: మేకపాటి రాజమోహన్రెడ్డి
దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి గురించి శాసనసభలో సీఎం జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేస్తూ మాట్లాడిన మాటలు తమ కుటుంబ సభ్యుల హృదయాలను స్పృశించాయనీ, మనోస్థైర్యాన్ని
నెల్లూరు(నగరపాలక సంస్థ), న్యూస్టుడే: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి గురించి శాసనసభలో సీఎం జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేస్తూ మాట్లాడిన మాటలు తమ కుటుంబ సభ్యుల హృదయాలను స్పృశించాయనీ, మనోస్థైర్యాన్ని నింపాయని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తెలిపారు. నెల్లూరులో మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గౌతమ్రెడ్డి ఆశలు, ఆశయాలు నెరవేరుస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో సంగం బ్యారేజీ నిర్మాణాన్ని 6 వారాల్లో పూర్తి చేసి గౌతమ్రెడ్డి పేరు పెడతామని ప్రకటించడం... ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కాలేజీని వ్యవసాయ, ఉద్యాన కళాశాలగా తీర్చిదిద్దుతామని సీఎం చెప్పడం హర్షణీయమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు