Congress-TMC: కాంగ్రెస్ను టీఎంసీలో కలిపేయండి!
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి పుండుమీద కారం చల్లినట్లు.. ఆ పార్టీని టీఎంసీలో విలీనం చేసి, మమతా బెనర్జీ నాయకత్వంలో పోరాడాలంటూ తృణమూల్ నాయకులు ఓ ఆఫర్ ఇచ్చారు.
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి పుండుమీద కారం చల్లినట్లు.. ఆ పార్టీని టీఎంసీలో విలీనం చేసి, మమతా బెనర్జీ నాయకత్వంలో పోరాడాలంటూ తృణమూల్ నాయకులు ఓ ఆఫర్ ఇచ్చారు. దీనిపై తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్ నేతలు.. టీఎంసీని భాజపా ఏజెంటు అంటూ విమర్శించారు. ‘భాజపాపై పోరాడి, ఎలా ఓడించాలో టీఎంసీ మీకు చూపించింది. ఇక కాంగ్రెస్ పార్టీని టీఎంసీలో విలీనం చేసి, మమత నాయకత్వంలో పోరాడటమే నయం’ అని పశ్చిమబెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ భాజపాపై పోరాడే పరిస్థితిలో లేదని, అందువల్ల వారికి మమత లాంటి నాయకులు అవసరమని టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ అన్నారు. టీఎంసీ నేతలు భాజపా ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారని, తాము ఎలా పోరాడాలో వాళ్లు చెప్పాల్సిన అవసరం లేదని పశ్చిమబెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధిర్ చౌధురి మండిపడ్డారు. వాళ్లు నిజంగా భాజపాతో పోరాడాలనుకుంటే టీఎంసీనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్