‘జనసేన’ ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీల్లో నియామకాలు

జనసేన ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీల్లో మరో 31 మందిని నియమించినట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 12 Mar 2022 05:51 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జనసేన ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీల్లో మరో 31 మందిని నియమించినట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాల సమన్వయ కమిటీలో 8 మంది, సెక్యూరిటీ కమిటీలో 11 మంది, మీడియా కో ఆర్డినేషన్‌ కమిటీలో ఆరుగురు, వాలంటీర్ల కమిటీలో ముగ్గురు, క్యాటరింగ్‌ కమిటీ, మెడికల్‌ అసిస్టెన్స్‌ కమిటీ, ప్రచార కమిటీలో ఒక్కొక్కరి చొప్పున నియమించారు.

మార్చి నెల 14వ తేదీన నిర్వహించనున్న ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘జన జన జన జనసేనా’ అనే గీతాన్ని, గోడ పత్రికనూ ఆయన ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని