జనసేనలో పలువురి చేరిక

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన కల్యాణి గ్రూపుల అధినేత లోళ్ల రాజేష్‌ శనివారం జనసేనలో చేరారు. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌

Published : 13 Mar 2022 05:24 IST

ఈనాడు, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన కల్యాణి గ్రూపుల అధినేత లోళ్ల రాజేష్‌ శనివారం జనసేనలో చేరారు. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం నుంచి వైకాపా నాయకులు చోడిపిండి సుబ్రహ్మణ్యం, గొలిశెట్టి సూర్యచంద్రరావు, ఆరేటి బులి వెంకట్రామయ్య, కాంగ్రెస్‌ నుంచి అప్పన ప్రసాద్‌, బైపీ పుల్లారావు, ఏపీ టైలర్స్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సీహెచ్‌ మధుబాబు తదితరులు పార్టీలో చేరారు.  

* మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్న మంగళగిరి మండలంలోని ఇప్పటం గ్రామంలో సభా ప్రాంగణాన్ని సినీ నటుడు కె.నాగబాబు శనివారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని