5న జనసేన విస్తృతస్థాయి సమావేశం
జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఈనెల 5న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొననున్నారు. వైకాపా ప్రభుత్వ పాలన,
ఈనాడు, అమరావతి: జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఈనెల 5న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొననున్నారు. వైకాపా ప్రభుత్వ పాలన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం, రైతులు- వ్యవసాయ స్థితిగతులు, పెరిగిన విద్యుత్ ఛార్జీలు, పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఇందులో పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల ఛైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గాల ఇన్ఛార్జులు, వీర మహిళా ప్రాంతీయ కోఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులు పాల్గొంటారని పార్టీ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట