Raghurama: అపహరించి హత్య చేయాలనుకున్నారు: రఘురామ
గతంలో జగన్ ఏవేవో చేశారు.. ఇప్పుడు సీఎం అయ్యారు.. ఇక నుంచైనా ఆయన హత్యా రాజకీయాలు.. అపహరణ రాజకీయాలు మానుకోవాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
ఈనాడు, దిల్లీ: గతంలో జగన్ ఏవేవో చేశారు.. ఇప్పుడు సీఎం అయ్యారు.. ఇక నుంచైనా ఆయన హత్యా రాజకీయాలు.. అపహరణ రాజకీయాలు మానుకోవాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో తాను హైదరాబాద్ వెళ్లినప్పుడు తనను అరెస్టు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుసుకొని దిల్లీ వచ్చేశానని తెలిపారు. తాజాగా తనను నకిలీ పోలీసులతో అపహరించి.. బయటకు తీసుకెళ్లి హత్య చేయించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మాజీ తీవ్రవాదులతో సంబంధం ఉన్న ఓ మాజీ ఐపీఎస్ అధికారి దీనికి ప్రణాళిక వేెసినట్లు తెలిసిందన్నారు.. వై కేటగిరీ భద్రత ఉన్న పార్లమెంటు సభ్యుడి ప్రాణాలకే రక్షణ లేకుంటే మామూలు వ్యక్తుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై తాను ఇప్పటికే కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఏకే భల్లాకు లేఖ రాశానన్నారు. సీబీసీఐడీ ఏడీజీపీ పి.వి.సునీల్కుమార్ వ్యవహారాలపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని నియమించాలని కోరుతూ మరో లేఖ రాసినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్