Andhra News: దేవాదాయ శాఖ కేరాఫ్‌ పశ్చిమగోదావరి

దేవాదాయ శాఖకు పశ్చిమగోదావరి జిల్లాకు విడదీయరాని బంధం ఉన్నట్లుంది. ఇక్కడి నుంచి గెలుపొందిన పలువురు నాయకులు దేవాదాయ శాఖ మంత్రులుగా పనిచేశారు.

Updated : 12 Apr 2022 10:06 IST

కుక్కునూరు, న్యూస్‌టుడే: దేవాదాయ శాఖకు పశ్చిమగోదావరి జిల్లాకు విడదీయరాని బంధం ఉన్నట్లుంది. ఇక్కడి నుంచి గెలుపొందిన పలువురు నాయకులు దేవాదాయ శాఖ మంత్రులుగా పనిచేశారు. అందులోనూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఈ పదవికి పట్టుకొమ్మగా ఉంటోంది. తాజాగా కొలువుదీరిన మంత్రివర్గంలోనూ తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు కొట్టు సత్యనారాయణను దేవాదాయ శాఖ మంత్రి పదవి వరించింది. గత తెదేపా ప్రభుత్వంలో మిత్రపక్షం భాజపా అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలుపొందిన పైడికొండల  మాణిక్యాలరావు ఇదే పదవి చేపట్టారు. ఎన్టీఆర్‌ హయాంలో ఇక్కడి నుంచి గెలిచిన ఈలి ఆంజనేయులు ఈ శాఖ మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో అత్తిలి నుంచి గెలుపొందిన దండు శివరామరాజు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని