Andhra News: విజయసాయికే సమన్వయ బాధ్యతలు
సరిగ్గా వారం తిరిగే సరికి వైకాపాలో పదవులు మారిపోయాయి. పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతకే పరిమితమైన ఎంపీ విజయసాయిరెడ్డికి తిరిగి పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఆ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డికి తగ్గించారు.
వారం రోజులకే వైకాపాలో మారిన పదవులు
ఈనాడు, అమరావతి: సరిగ్గా వారం తిరిగే సరికి వైకాపాలో పదవులు మారిపోయాయి. పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతకే పరిమితమైన ఎంపీ విజయసాయిరెడ్డికి తిరిగి పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఆ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డికి తగ్గించారు. గత మంగళవారం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల సమన్వయ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి, ఎంపీ విజయసాయిరెడ్డికి వైకాపా అనుబంధ విభాగాల బాధ్యతలను అప్పగించిన విషయం విదితమే. తాజాగా ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల సమన్వయ బాధ్యతలను సాయిరెడ్డికి ముఖ్యమంత్రి జగన్ అప్పగించారు. సజ్జలకు ఎమ్మెల్యేలు, మీడియా సమన్వయ బాధ్యతలు ఇచ్చారు. ఈ నెల 19న జారీ చేసిన నియామక ఉత్తర్వుల్లో పాక్షికంగా మార్పులు చేశామంటూ వైకాపా అధ్యక్షుడు జగన్ పేరిట ఉన్న ఒక ప్రకటనను విజయసాయిరెడ్డి మంగళవారం తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ట్వీట్లో ఆయన ట్యాగ్ చేసిన ప్రకటననే తర్వాత వైకాపా కేంద్ర కార్యాలయం విడుదల చేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.