Andhra News: నన్నే బహిష్కరిస్తారా.. రాజీనామాలు చేయండి: వైఎస్ కొండారెడ్డి ఒత్తిడి
చాగలమర్రి- రాయచోటి జాతీయ రహదారి పనులు చేస్తున్న ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ కంపెనీ నుంచి డబ్బులు డిమాండు చేసిన అభియోగాలపై అరెస్టయి.. అనంతరం బెయిల్పై విడుదలైన
ఈనాడు డిజిటల్, కడప: చాగలమర్రి- రాయచోటి జాతీయ రహదారి పనులు చేస్తున్న ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ కంపెనీ నుంచి డబ్బులు డిమాండు చేసిన అభియోగాలపై అరెస్టయి.. అనంతరం బెయిల్పై విడుదలైన వైయస్ఆర్ జిల్లా చక్రాయపేట మండల వైకాపా ఇన్ఛార్జి వైఎస్ కొండారెడ్డి మరో ఎత్తు వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి తనను బహిష్కరించాలంటూ కలెక్టర్కు ఎస్పీ ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో.. నిరసనగా రాజీనామాలు చేయాలని మండలంలోని 16 మంది సర్పంచులు, 9 మంది ఎంపీటీసీ సభ్యులపై ఆయన ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. వీరిలో నలుగురు స్పందించి కొండారెడ్డి పీఏ ఓబుల్రెడ్డి సారథ]్యంలో గురువారం ఎంపీ అవినాష్రెడ్డి వద్దకు వెళ్లారు. జిల్లా బహిష్కరణ నిర్ణయంపై పునస్సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందేనని ఎంపీ స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు రాయచోటి జైలు నుంచి కడప చేరుకున్న కొండారెడ్డి గురువారం హైదరాబాద్కు పయనమైనట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా