YSRCP Office: వైకాపా కార్యాలయానికి జిల్లా జైలు స్థలం!
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం స్థలంలో క్రమేపీ ప్రభుత్వ, ప్రైవేటు అవసరాలకు గుట్టుచప్పుడు కాకుండా కేటాయింపులు జరిగిపోతున్నాయి. ఈ జైలు స్థలం మొత్తం
ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు
ఈనాడు డిజిటల్- రాజమహేంద్రవరం, న్యూస్టుడే- నేరవార్తలు: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం స్థలంలో క్రమేపీ ప్రభుత్వ, ప్రైవేటు అవసరాలకు గుట్టుచప్పుడు కాకుండా కేటాయింపులు జరిగిపోతున్నాయి. ఈ జైలు స్థలం మొత్తం 170 ఎకరాలు. ఇందులో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య కళాశాల కోసం దాదాపు 13 ఎకరాలను తీసుకుంది. తాజాగా అదే జైలు స్థలంలో మరో 2 ఎకరాలు తూర్పుగోదావరి జిల్లా వైకాపా కార్యాలయం కోసం కేటాయించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా అర్బన్ తహసీల్దార్ ద్వారా ప్రతిపాదనలు పెట్టారు. దీనిపై ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పైకి లీజు చెల్లించి వినియోగించుకుంటామని చెబుతున్నా... శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నందున క్రమంగా పార్టీ ఆ స్థలాన్ని సొంతం చేసుకుంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వైద్య కళాశాల కోసం తీసుకున్న స్థలంలో డీఐజీ కార్యాలయం, వసతి గృహాలు ఉన్నాయి. ఇప్పుడు వైకాపా కార్యాలయానికి స్థలం కేటాయించాలని ప్రతిపాదించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి