డోన్‌ తెదేపా అభ్యర్థి సుబ్బారెడ్డి

‘తెదేపా కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. బుగ్గన ఆటలు ఇక డోన్‌లో సాగవు. బుగ్గనకు తగిన వాడిని తయారు చేశాను. బుల్లెట్‌లా దూసుకెళతారు. ఎన్నికల్లో బుగ్గనను చిత్తుచిత్తుగా ఓడించాలి. డోన్‌లో తెలుగుదేశం

Published : 20 May 2022 06:06 IST

ఈనాడు, కర్నూలు: ‘తెదేపా కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. బుగ్గన ఆటలు ఇక డోన్‌లో సాగవు. బుగ్గనకు తగిన వాడిని తయారు చేశాను. బుల్లెట్‌లా దూసుకెళతారు. ఎన్నికల్లో బుగ్గనను చిత్తుచిత్తుగా ఓడించాలి. డోన్‌లో తెలుగుదేశం అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి. ఆయన నాయకత్వంలో అందరూ కలిసి పని చేయాలి. బుగ్గనకు సమఉజ్జీగా సుబ్బారెడ్డిని నిలబెడుతున్నాం’ అని చంద్రబాబు తెలిపారు.  నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంలో గురువారం రాత్రి నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ధాన్యం కొనుగోళ్లలోనూ అక్రమాలే...

‘ధాన్యం సేకరణలో రైతుల పేరు చెప్పి ఇతరుల పేరుతో కుంభకోణం జరిగిందని వైకాపా ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ చెప్పారు.. ఆధారాలున్నాయని కూడా ఆయన అన్నారు. ఒక్క గోదావరి జిల్లాల్లోనే కాదు.. రాష్ట్రమంతా ఇదే జరిగింది. కొన్న ధాన్యానికి చెల్లింపులు లేవు. ఈ ప్రభుత్వం దళారీ ప్రభుత్వంగా మారింది. ఉద్యోగులు కష్టాల్లో ఉన్నప్పుడు తెదేపా పీఆర్సీ, డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇచ్చింది. వైకాపా ప్రభుత్వం చేష్టలకు ఉద్యోగులకు నిద్రపట్టడం లేదు’ అని చంద్రబాబు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని