సుబ్రహ్మణ్యం మృతిపై నిజనిర్ధారణ కమిటీ
వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ పూర్వ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ పూర్వ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీలో తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్బాబు, ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు, మాజీ మంత్రి పీతల సుజాత, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు సభ్యులుగా ఉంటారన్నారు. శనివారం ఈ కమిటీ కాకినాడలో పర్యటిస్తుందని తెలిపారు. సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులను తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుక్రవారం ఫోనులో పరామర్శించారు. రాష్ట్రంలో ఎస్సీలపై వైకాపా సాగిస్తున్న దాడులపై జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవహక్కుల సంఘం, రాష్ట్ర ఎస్సీ కమిషన్, ఏపీ డీజీపీలకు శుక్రవారం ఆయన లేఖలు రాశారు.
పోలీసులు అడ్డుకోవడం దారుణం: హర్షకుమార్
మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూడనివ్వకుండా పోలీసులు కట్టడి చేయడం దారుణమని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మండిపడ్డారు. ‘మృతుడితండ్రిని గానీ మమ్మల్ని గానీ మార్చురీకి వెళ్లనివ్వలేదు. వారు దోషులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’అని హెచ్చరించారు.
అనంతబాబును అరెస్టు చేయాలి: సీపీఐ
దళిత యువకుడి అనుమానాస్పద మృతి ఘటనలో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడాలంటే అనంతబాబును అరెస్టు చేసి విచారించాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!