సోనియా గాంధీతో కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు... సోనియాగాంధీ నివాసంలో శుక్రవారం సుమారు 45 నిమిషాలపాటు భేటీ సాగింది. ఇందులో.. తెలుగు రాష్ట్రాలతో పాటు

Published : 21 May 2022 05:54 IST

ఈనాడు, దిల్లీ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు... సోనియాగాంధీ నివాసంలో శుక్రవారం సుమారు 45 నిమిషాలపాటు భేటీ సాగింది. ఇందులో.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పూర్వ వైభవానికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. తెలంగాణలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా బలంగా ఉండడం, ఇటీవల రాహుల్‌గాంధీ సభ విజయవంతం కావడం, పార్టీలో చేరేందుకు పలువురు ఆసక్తి చూపుతున్న తీరుపై చర్చించారు. మరింత క్రియాశీలంగా ఉండాలని, ఏపీలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలని సోనియా కిరణ్‌కుమార్‌రెడ్డికి సూచించారు. తెలంగాణ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉండడం, పార్టీ నేతలతో ఉన్న సంబంధాల దృష్ట్యా అక్కడ అవసరమైనప్పుడు నేతలకు తగిన సలహాలు, సూచనలు అందించాలని ఆయనకు తెలిపారు. ఎక్కువగా జాతీయ రాజకీయాలపైనే చర్చ సాగిందని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని