Andhra News: పదవి లేకున్నా నేనే సీనియర్‌ను.. ఆ మంత్రుల వద్దకు వెళ్లకండి: ముత్తంశెట్టి

: ‘నాకు మంత్రి పదవి లేదని అధికారులు, ప్రజాప్రతినిధులు వేరే మంత్రుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స తర్వాత నేనే సీనియర్‌ని. ఎలాంటి పనులున్నా చేయగలను

Updated : 21 May 2022 09:03 IST

గ్రామీణ భీమిలి, న్యూస్‌టుడే: ‘నాకు మంత్రి పదవి లేదని అధికారులు, ప్రజాప్రతినిధులు వేరే మంత్రుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స తర్వాత నేనే సీనియర్‌ని. ఎలాంటి పనులున్నా చేయగలను. అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తా. అందువల్ల ఎవరూ పక్క జిల్లాల మంత్రుల వద్దకు వెళ్లొద్దు’ అని మాజీమంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తన నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులను సూచించారు. శుక్రవారం విశాఖ జిల్లా భీమిలి మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అభివృద్ధి పనులు, సమస్యల గురించి చెప్పడంతో ఆయన స్పందించి ఇలా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని