మహానాడు వేదికగా... జగన్‌ పాలనకు చరమగీతం

మహానాడు వేదికగా రాష్ట్రంలో జగన్‌ పాలనకు చరమగీతం పాడతామని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం

Published : 22 May 2022 05:49 IST

తెదేపా నాయకురాలు వంగలపూడి అనిత

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మహానాడు వేదికగా రాష్ట్రంలో జగన్‌ పాలనకు చరమగీతం పాడతామని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం మండువవారిపాలెం గ్రామ సమీపంలో ఈ నెల 27, 28న నిర్వహించనున్న తెదేపా మహానాడు ఏర్పాట్లను శనివారం సాయంత్రం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... వైకాపా పాలనలో రాష్ట్రంలో మహిళలకు ఇంట్లో ఉన్నా... బయటకు వెళ్లినా రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో వైకాపా ప్రజాప్రతినిధులపై జనం చెప్పులు వేస్తున్నారని, మంత్రులు బస్సు యాత్ర చేపడితే చీపుర్లు వేస్తారని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని